DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శివ కోడు లోని భూగర్భ జలాల రక్షణకు సమష్టి కృషి :  కలెక్టర్ మురళీధర్ రెడ్డి

జాతీయ రహదారి పనులతో 17 వేల ఎకరాలకు నీరు నిలుపుదల. ? 

తూగో జిల్లాలో అగమ్య గోచరంగా రాజోలు మండలం. .

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . .

అమరావతి, జులై  17, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు లోని భూగర్భ జలాల పరిరక్షణకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు, నీటిపారుదల విభాగపు

అధికారులు సంయుక్తంగా పనిచేయవలసి అవసరం ఉందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. 
జాతీయ రహదారి 216 విస్తరణ పనులు శివకోడు లాక్స్ మీదుగా

సాగుతుండడంతో రాజోలు మండలం శివకోడు గ్రామ పరిధిలో జరుగుతున్న ఇంగ్లాండ్ వాటర్ బేస్ పనులను నీటిపారుదల శాఖా అధికారులతో కలిసి అయన పరిశీలించారు. ఈ విస్తరణ పనుల

ప్రభావంతో సుమారు 17 వేల ఎకరాల వ్యవసాయ భూములు నష్ఠానికి గురవుతాయని అధికారులు కలెక్టర్ కు తెలియచేసారు.  à°…నంతరం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మీడియా

ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ రహదారి 216 విస్తరణ పనులు నాలుగు దశల్లో జరుగుతున్నాయని, మొదటి రెండు దశలు ఎటువంటి వివాదాలు లేకుండానే జరుగుతున్నాయని తెలిపారు.

తదుపరి రెండు దశలోనే చిన్నపాటి వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. 

రహదారి విస్తరణ పనుల వ్యవహారం కొనసాగితే మండలం లో వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీరు అందే

అవకాశం లేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. 

కలెక్టర్ పర్యటనలో అమలాపురం ఆర్ డి ఓ బివి రమణ, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, సూపరెంటెండెంట్

ఇంజనీర్ కృష్ణ రావు, నీటిపారుదల శాఖా అధికారులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

 

#dns  #dnslive  #dnsmedia  #dnsnews  #dnsonline  #vizag  #visakhapatnam  #amaravati  #amaravathi  #east  #godavari  #razole  #sivakodu  #NH  #collector  #kakinada  #amalapuram  #irrigation  #water  #works  #farmers  #RDO

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam