DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజల కోసమే పవన్ ప్రజా యాత్ర ..20 నుంచీ జన బాహుళ్యం లోకి

20 నుంచీ జన బాహుళ్యం లోకి  à°œà°¨ సేనాని  à°ªà±à°°à°œà°¾ యాత్ర 
ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర. . . .
45 రోజులు 175 నియోజక వర్గాలు...

విశాఖపట్నం, మే 17, 2018 (DNS Online) :  à°œà°¨ సేన అధినేత పవన్ కళ్యాణ్

జన బాహుళ్యం లోకి ఈ నెల 20 నుంచి రానున్నట్టు ప్రకటించారు. గురువారం నగరంలోని రామాటాకీస్ సమీపం లో గల అంబెడ్కర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అధికార పార్టీల వైఖరిని తప్పుపడుతూ, వాస్తవాలను ప్రజల చెంతకు తీసుకు వెళ్లేందుకే బస్సు యాత్రను

చేపట్టినట్టు తెలిపారు. సుమారు 45 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ జనసేన పవన్ విశాఖలో ప్రకటించారు. అక్రమంగా జరిగిన రాష్ట్ర విభజనతో నష్ట పోయిన రాష్టానికి న్యాయం

చేయాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు యాత్రను చేపడుతున్నట్టు తెలిపారు. ఈ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో 17 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. మొత్తం 45 రోజుల్లో 175

నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర సాగుతుందని, ప్రతి జిల్లాయాత్ర తర్వాత లక్ష మందితో నిరసన కవాతులు చేపట్టి, గతం లో వివిధ ఉద్యమాల్లో వీరమరణం చెందిన అమర వీరులకు

నివాళులు అర్పించి, తదుపరి,  à°—à°‚à°— పూజ చేపట్టి  à°…నంతరం యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 
మరో రెండు రోజులు విశాఖ నగరం లోనే ఉంది, కార్యకర్తలు, నియోజక వర్గ నేతలతో

సమావేశం జరుపుతామన్నారు. ఈ యాత్ర లో రోడ్ షోలు, పాదయాత్రలు నిర్వహించడం తో పాటు, సామాన్య జనం తో మమేకమై చర్చా గోష్టి కూడా జరుగుతుందని, తద్వారా రాజకీయ

జవాబుదారీతనంమీద ప్రజల్లో అవగాహన పెంచటమే జనసేన పార్టీ లక్ష్యం అన్నారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam