DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శతాబ్దాలుగా ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతోంది. : డాక్టర్ కె ఎస్ చలం

ఉత్తరాంధ్రా కూడా ఆంధ్రాలో భాగమే . . . . : 

ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి 

(రిపోర్ట్ : సాయిరాం చిలకమఱ్ఱి , బ్యూరో చీఫ్). .

విశాఖపట్నం, జులై 18, 2019

 (డిఎన్‌ఎస్‌) : బ్రిటిష్ నాటి కాలం నుంచే ఉత్తరాంధ్రా జిల్లాలకు తీరని అన్యాయమే జరుగుతోందని ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి కన్వీనర్, యుపిఎస్ సి కమిటీ సభ్యులు

డాక్టర్ కె ఎస్ చలం అభిప్రాయం పడ్డారు. గురువారం నగరం లోని పౌర గ్రంధాలయం లో ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏ పి యు డబ్ల్యు జె), ఉత్తరాంధ్ర

హక్కుల సాధన సమితి సంయుక్తంగా నిర్వహించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి పై ముచ్చట్లు కార్యక్రం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతం

కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో భాగమేనని, దీన్ని అభివృద్ధి పరచవలసిన భాద్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తదుపరి జరిగిన మూడు

విభజనలో ఉత్తరాంధ్ర కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఈ ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, గోదావరి పై కాటన్ డోరా కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా

కేవలం కుడి కాలువకు మాత్రమే నీళ్లు ఇవ్వడంతో à°Žà°¡à°® వైపున ఉన్న ఉత్తరాంధ్ర నీళ్లు లేక ఆర్చుకు పోయిందన్నారు. తద్వారా సుమారు 15  à°²à°•à±à°·à°² మంది వ్యవసాయ దారులు, కూలీలు, ఇతర

వర్గాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసిన దౌర్భాగ్యం పట్టిందన్నారు. ఈ ప్రాంతానికి రైల్వే జోన్ ఇచ్చ్చాము అని గొప్పగా డబ్బా కొట్టుకుంటున్న కేంద్రానికి

ఉత్తరాంధ్ర అడుగారిపోయిన వైనం కనపడలేదన్నారు. ఇక్కడ రాజకీయ నేతలు కూడా ఇక్కడ స్థానికులు కారని, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారేనన్నారు.

వీళ్లకు కేవలం తమ వ్యాపార అభివృద్దే తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి పై à°…à°‚à°¤ సానుకూలత లేదన్నారు.  à°ˆ సమావేశం లో ఏ పి యు డబ్ల్యు జె జిల్లా అధ్యక్షులు ఆర్. రామచంద్ర రావు,

చంద్ర మోహన్, ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి ప్రతినిధులు కళ్యాణ్ రావ్, వేగి బాబురావు, బాలరాజు, కన్నా రావు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam