DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జలశక్తి అభియాన్ లో అందరినీ భాగస్వాములను చెయ్యాలి: ..ప. గో కలక్టర్ ముత్యాల రాజు

పశ్చిమ గోదావరి జిల్లా కలక్టర్ రేవు ముత్యాల రాజు .

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . .

అమరావతి, జులై  19, 2019 (డిఎన్‌ఎస్‌) : జల్ శక్తి అభియాన్

కార్యక్రమం లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా లో జలాలను పెంచే ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజూ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డి ఆర్ డి ఏ , డ్వామా, అటవీ శాఖా, విద్య, వ్యవసాయ శాఖా, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో

భూ గర్భ జలాలను పెంచే కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసారు. అయన మాట్లాడుతూ లక్ష్య సాధనకు అన్ని విభాగాల అధికారులు సమస్థిగా పని చేయాలన్నారు. జులై 1

 à°¨à±à°‚à°šà°¿ సెప్టెంబర్ 15 వరకు మొదటి దఫా నిర్వహించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలన్నారు. నీటిని సంరంక్షించేందుకు వర్షపు

నీటిని భూమిలోకి ఇంకే విధంగా చేయడం, నీటి నిల్వ కోసం చెరువులు, గుంతలు, నవీకరణ పనులు చేపట్టడం, సాగు, గ్రాగు నీటి కోసం బోరు బావుల వద్ద రీ ఛార్జ్ స్రికర్స్ నిర్మాణ

పనులు, వాటర్ షెడ్ అభివృద్ధి పనులు, అటవీకరణ పనులు వంటివి చేపట్టాలన్నారు. ఈ పనులు చేపట్టే ముందు భో గర్భ వాటర్ లెవెల్స్ నమోదు చెయ్యాలని, అనంతరం కార్యక్రమాలు అమలు

చేసిన తర్వాత నీటి పెరుగుదల నమోదు చేయాలన్నారు. à°ˆ ప్రక్రియ లో ప్రజల్లో అవగాహనా  à°ªà±†à°‚చేందుకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడమే కాకుండా ప్రజలను

భాగస్వాములను చేయాలన్నారు. ఈ నీటి పెంపు ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ నిలిచి పోయేలా కార్యక్రమాలు చేయాలన్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులను సభ్యులుగా

చేర్చాలన్నారు. ఈ సమావేశం లో సంయుక్తర్ కలెక్టర్ ఎం. వేణుగోపాల రెడ్డి, డ్వామా పీడీ మల కొండయ్య, ఇంచార్జ్ డి ఆర్ గణేష్ కుమార్, విద్య శాఖాధికారి సి వి రేణుక తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam