DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ వాణి కి 10 వేలు కట్టు  శ్రీవారి విఐపి బ్రేక్  దర్శనం పట్టు

సామాన్య భక్తులకు కూడా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విఐపి బ్రేక్ దర్శనం  

ముఖ్యమంత్రి సమక్షంలో ప్రారంభం కానున్న శ్రీ వాణి పధకం  

దళారీని, సిబ్బంది చేతివాటం నిరోధనకే :

ఈఓ అనిల్ కుమార్ సింఘాల్  

(రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో). .

తిరుమల , జూలై 20,  2019 (DNS ) : తిరుమల తిరుపతి దేవస్థానం లో ఇక నుంచి సామాన్యులకు కూడా విఐపి బ్రేక్ ద్వారా

శ్రీవారి అనుగ్రహ దర్శనం లభించనుంది. అతి త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  à°¸à°®à°•à±à°·à°‚లో ప్రారంభం కానున్న శ్రీవాణి పధకం ద్వారా అమలు కానున్నట్టు

తెలుస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం ఈ పధకానికి 10 వేలు రూపాయలు విరాళం ఇచ్చిన భక్తులకు విఐపి బ్రేక్ ద్వారా స్వామి దర్శనం కల్పించనున్నారు. ఈ పధకానికి తగిన

విధి విధానాలు రూపొందించనున్నారు. ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భక్తులకు దగ్గరగా స్వామి దర్శనం, దేవస్థానానికి భారీ మొత్తం లో ఆదాయం

లభించనుంది. 

దళారులు, సిబ్బంది చేతివాటం  à°†à°ªà±‡à°‚దుకే  : ఈఓ . 

స్వామీ దర్శనం కోసం భక్తులను దోపిడీ చేస్తున్న దళారులు, టిటిడి సిబ్బంది చేతివాటాన్ని అదుపు

చేసేందుకే ఈ పధకాన్ని అమలులోకి తీసుకు వచ్చే ప్రయత్నం లో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నట్టు తెలుస్తోంది. టిటిడి అధికారిక విభాగం తో సంబంధం లేని టిటిడి

సిబ్బంది, ఇతర మధ్య వర్తులు, దళారుల దోపిడీ తిరుమలలో విపరీతం గా పెరిగిపోయి సంస్థ పరువు పోయే రీతి చేరుకుందన్నారు. దీనికి అడ్డుకట్ట వెయ్యడానికి శ్రీవాణి పధకం

ద్వారా సామాన్యులకు విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తే రెండు రకాలుగా సద్వినియోగం అవుతుందనే సంకల్పం వాచినట్టు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా భక్తులు చెల్లించే 10 వేల

రూపాయలు నేరుగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఖాతాలోకే వెళ్తాయన్నారు. 

à°ˆ పధకం అమలు లోకి వస్తే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అత్యంత ధనవంతమైన దేవాలయం à°—à°¾ ఆనతి కాలంలోనే చరిత్ర సృష్టించనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam