DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని క్రైస్తవంగా మార్చే ప్రయత్నాలు తక్షణం ఆపాలి : సాదు పరిషత్

హిందు ఆలయాల నిధులు ఇతరులకు ఎలా దోచి పెడతారు ?

అర్చకులకు ఇవ్వడానికి లేని డబ్బు, పాస్టర్లు, మౌలీ లకు ఎలా ఇస్తారు.  

ప్రభుత్వ కబంద హస్తాలనుంచి ఆలయాలను

విడుదల చెయ్యాలి

ఆలయాలు అంటే కేవలం చర్చులు మాత్రమేనా ?

హిందూ సంఘాల నిరసనల ఫలితమే  à°µà°¿à°¶à°¾à°– సీపీ ఆదేశాల మార్పు  

ఓటు వేసిన మాకు నీ పదవి దింపడం కూడా

తెలుసు. . .

సి ఎం పరపతి కోసం వేరే మార్గం చూసుకోవాలి :

వైఎస్ జగన్ పై ఆంధ్ర ప్రదేశ్ సాదు పరిషత్ మండిపాటు.   

(రిపోర్ట్ : సాయిరాం, CVS , Burearu, ) . . . . 

విశాఖపట్నం,

జులై  22, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ ని  à°•à±à°°à±ˆà°¸à±à°¤à°µà°‚ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది అనడానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్

ఆర్ కె మీనా ఇటీవల ఇచ్చిన ఆదేశాలే నిదర్శనం అని ఆంధ్ర ప్రదేశ్ సాదు పరిషత్ మంది పడింది. సోమవారం నగరం లోని మహా నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం

వద్ద హిందూ ధార్మిక సంస్థల తో సంయుక్తంగా నిర్వహించిన నిరసనల్లో భారీ సంఖ్యలో సాదు పుంగవులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొందూరు కు చెందిన

శ్రీనివాసానంగా సరస్వతి స్వామి మాట్లాడుతూ à°ˆ నెల 4 à°µ తేదీన స్పందన కార్యక్రమం లో డానియల్ శ్యామ్ అనే వ్యక్తి  à°†à°¨à± లైన్ ద్వారా ఫిర్యాదు మేరకు చర్చిల భద్రతకు, వాళ్ళ

ప్రచారానికి ఆటంకం లేకుండా ప్రతినెలా సమీక్షకు జరిపే విధంగా విశాఖ నగర కొత్వాల్ మీనా నగర పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ లకు ఆదేశాలు జారీ చెయ్యడం అత్యంత

దురదృష్టకరం అన్నారు. ఏ చర్చి లోను పాస్టర్ కానీ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ నగరంలో మత కల్లోలాలు జరుగుతున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చి పోలీసు కమిషనర్

అతిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఇలాంటి నిర్ణయం ఒక స్థానిక అధికారి తీసుకునే అవకాశమ్ లేదన్నారు. దీని పై రాష్ట్రవ్యాప్తంగా హిందూ

ధార్మిక సంఘాలు చేసిన నిరసనలకు ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాన్ని సవరించిందన్నారు.   

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లోని హుండీల్లో

లక్షలాది మంది భక్తులు వేసే ముడుపులు, మొక్కుబడులతోనే ఆలయాలు నడుస్తున్నాయి తప్ప, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదన్నారు. పైగా హిందూ ఆలయాలను

దేవాదాయ ధర్మాదాయ శాఖా పేరుతొ కబ్జా చేసి, హిందువుల డబ్బులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 

అర్చకులకు మోడిచెయ్యి, పోస్టర్లకు కుమ్మరింపా ?. . . 

ఇటీవల

ఏర్పడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుందని సాధుపరిషత్ మండిపడింది. హిందువుల గుల్ల నుంచి దోచుకుంటున్న నిధుల నుంచి కూడా

అర్చకులకు డబ్బులు ఇవ్వడానికి తెగ ఇబ్బంది పడే ప్రభుత్వం, క్రైస్తవ పాస్టర్ల కు, ముస్లిం మౌలాలకు వేలకు వేలు పంచేందుకు సిద్ధపడిందన్నారు. ప్రభుత్వం అంటే

అందరినీ సమానంగా చూడాలే తప్ప, కేవలం తమ మతం వారిని మాత్రమే అందలం ఎక్కించి,. ప్రక్కవారిని దోచుకోకూడదన్నారు. 

ఓటేసిన మాకు దింపడం కూడా తెలుసు ? . . . .

à°—à°¤

ప్రభుత్వం పై నమ్మకం లేనందునే, .  à°®à±€à°•à± ఓటు వేసి అధికారాన్ని అప్పగించామని, కోట్లాది మంది హిందువులకు నమ్మద ద్రోహం చేస్తే మిమ్మల్ని దింపడం కూడా తెలుసు అని

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని హెచ్చరించింది. సాధుపరిష త్  à°ªà±à°°à°œà°² ఆగ్రహానికి గురికాకుండా చేసిన తప్పులని సరిదిద్దుకోవాలనే సూచించారు.  

సి ఎం

పరపతి కోసం వేరే మార్గం చూసుకోవాలి :

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద  à°¸à°¾à°¨à±à°­à±‚తి, పరపతి పొందేందుకు విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా చేసిన à°ˆ

విపరీత చర్యకు అతను తగిన మూల్యం చెల్లించక తప్పదని విశాఖ జిల్లా ధార్మిక సంఘాలు హెచ్చరించాయి.  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా హిందూ సంఘాలు చేసిన నిరసనల ఫలితమే ఆదివారం తమ

ఆదేశాలను విశాఖ సీపీ సవరించడం జరిగిందని తెలియచేశాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam