DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రచండ వేగంతో నింగిలోకి చంద్రయాన్ 2 పయనం : ఇస్రో చైర్మన్ శివన్   

"చంద్ర"  à°ªà±à°°à°¯à°¾à°£à°‚ లో భారత అడుగు విజయవంతం: 

మిషన్ లక్ష్యానికి మించి విజయం సాధించాం. 

దక్షిణ ధృవం దిశగా  à°œà°¿à°Žà°¸à±à°Žà°²à± వి  à°®à°¾à°°à±à°•à± 3  à°°à°¾à°•à±†à°Ÿà±

 à°…డుగులు 

ఏళ్ళ తరబడి శ్రమించిన మొత్తం బృందానికి అభినందనలు  

(రిపోర్ట్ : సాయిరాం, CVS , Burearu, ) . . .  

విశాఖపట్నం, జులై  22, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ మంది భారతీయుల

ఆశీస్సులతో భారతీయ అంతరిక్ష పరిశోధన శాల (ఇస్రో) శాస్త్రవేత్తలు ఈ రోజు అత్యంత ఘానా విజయం సాధించారని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. సోమవారం నెల్లూరు జిల్లా

శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడిన చంద్రయాన్ 2 మొదటి దశ విజయవంతం కావడం తో అయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏళ్ళ తరబడి శాస్త్రవేత్తల బృందం

నిద్రాహారాలు మరిచిపోయి మరీ ఈ అద్భుత విజయాన్ని సాధించి అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశ కీర్తి పతాకను చాటారన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 :43 గంటల సమయంలో జూలు

విదుల్చుకున్న సింహం మాదిరిగా జిఎస్ఎల్ వి మార్క్ 3 రాకెట్ ప్రచండ వేగంతో  à°’క్క సారిగా నింగి లోకే ఎగిసింది. సుమారు 15 నిమిషాల సమయం  à°•à±à°·à°£ క్షణం కేవలం à°ˆ ప్రయోగ శాల

లోని శాస్త్రవేత్తలే కాక మొత్తం దేశం యావత్తు ఉత్కంఠ తో ఎదురుచూసింది. ప్రపంచ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కూడా భారత శాస్త్రవేత్తల మేధాశక్తిని నిశితంగా

పరీక్షించారు. మొదటి దశ గమనం ఫలితం ఉపగ్రహం నుంచి లభించిన వెంటనే ఇస్రో చైర్మన్ శివన్ సభికులను, దేశాన్ని ఉద్దేశించి తమ లక్ష్య సాధనను వివరించారు. ఈ సందర్బంగా అయన

మాట్లాడుతూ తాము నిర్దేశించి, ఆశించిన గమనం కంటే మరింత వేంగంగా జి ఎస్ ఎల్ వి మార్క్ 3 నింగిలోకి దూసుకు వెళ్తోందన్నారు. దీనికోసం అహరహం శ్రమించిన యువ

శాస్త్రవేత్తలు, సీనియర్లకు ప్రత్యేక అభినందనలు తెలియచేసారు. 

ఇది కేవలం అంతరిక్షంలో భారత్ తోలి అడుగు మాత్రమేనని రానున్న కాలంలో మరిన్ని విజయాలు

సాధించే విధంగా ఈ రోజునుంచే కృషి చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. చంద్రుని దక్షిణ ధృవం పైకి ఇంతవరకూ వెళ్లిన వారు లేరని, భారత్ చేపట్టిన ఈ ప్రయోగం తో

ప్రపంచ దేశాలకు భారతీయ మీద శక్తి ప్రకటించబడుతున్నారు. తమ లక్ష్య సాధన లో సహకరించిన అన్ని విభాగాల ప్రతినిధులకు, సంఘీభావం ప్రకటించిన ప్రజలకు అయన ధన్యవాదాలు

తెలియచేసారు. 

à°ˆ  à°…ద్భుతమైన దుష్యాన్ని ప్రత్యక్షంగా వీక్షయించేందుకు ఇషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్, ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ సహా పూర్వ

శాస్త్రవేత్తలు, వేలాదిగా ప్రజలు శ్రీహరికోటకు విచ్చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam