DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉజ్వల ద్వారా గిరిజనులకు నర్సింగ్ లో శిక్షణ

విశాఖపట్నం, మే 17, 2018 (DNS Online) : à°—ిరిజన యువతలకు ఉపాధి కల్పన ధ్వేయంగా విశాఖపట్నం జిల్లా పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఉజ్వల-2 కార్యక్రమం ద్వారా జీఎంఆర్

ఫౌండేషన్ సహకారంతో నర్సింగ్ లో శిక్షణ ఇప్పించి గిరిజన యువతులకు ఆర్థికంగా స్వతంత్ర ఎదగడానికి జిల్లా పోలీసుల తోడ్పాటు. à°œà°¿à°²à±à°²à°¾ ఎస్పీ శ్రీ రాహుల్దేవ్ శర్మ

మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని జిఎంఆర్ ఆసుపత్రి నందు గిరిజన యువతులకు 45 రోజులు ఉచితంగా భోజన వసతి సౌకర్యాలు కల్పించి నర్సింగ్ శిక్షణ ఇచ్చి, రెడ్ క్రాస్

సొసైటీ ఆఫ్ ఇండియా వారి ద్వారా హైదరాబాదులో రూ.10,000 వేతనం వచ్చేవిధంగా ఉద్యోగాలు నియమిస్తారు.

ఇప్పటికే 35మంది మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన యువతులకు

నర్సింగ్ లో శిక్షణ పూర్తి చేసికొని ఉద్యోగం కల్పించడం జరిగింది. గిరిజన యువతులకు నర్సింగ్ శిక్షణ నిమిత్తం 30 మంది ఎంపిక చేశారు. వీరు10వ తరగతి నుండి డిగ్రీ వరకు

చదువుకొని ఉన్నారు.
చింతపల్లి సబ్ డివిజన్ సంబంధించి చింతపల్లి ,జీకేవీధి, సీలేరు, పాడేరు మరియు డుంబ్రిగుడ చెందిన మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన సప్పర్ల,

నల్లజర్ల దుప్పులు వాడా, పుజారిపాకలు,కుమ్మరపల్లి, వలస గడ్డ, మామిడిపల్లి,చమగెడ్డ, మరియు బలపం గ్రామాలకు చెందినవారు.
శిక్షణలో కష్టపడి, మనస్సు పెట్టి నేర్చుకొని

ఉద్యోగాలలో స్థిరపడాలని తద్వారా కుటుంబానికి ఆసరాగా ఉండాలన్నారు. ఓర్పు ,సహనం కలిగి ఉండి గౌరవమర్యాదలతో మెలగాలన్నారు. à°šà°¿à°‚తపల్లి ఎస్సై జి.రమేష్ మరియు విమెన్

పీ.సీ.లు ఎస్కార్టుగా ఇచ్చి బస్సులో శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉన్న జిఎంఆర్ ఆస్పత్రికి పంపించడం జరిగింది.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam