DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నారి జాషిత్ జాడ  కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి, జులై  23, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం లో సోమవారం సాయంత్రం అపహరణకు గురైన

చిన్నారి జాషిత్ (4 ఏళ్ళు) జాడ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మండపేట విజయలక్ష్మి నగర్ లో నాయనమ్మ తో కలసి వాకిoగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుoడగా జషిత్ (4) అనే

బాలుడిని గుర్తు తెలియని దుoడగుడు బైక్ పై వచ్చి నాయనమ్మను కొట్టి ఎత్తుకు పోయారు. ప్రశాంతంగా ఉండే మండపేటలో కిడ్నాప్ సంఘటన వులిక్కిపడినట్లుగా చేసింది. స్థానిక

విజయలక్ష్మి నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తండ్రి నూక వెంకటరమణ యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా, బెండీ నాగావళి కూడా స్థానిక కెనరా బ్యాంకు లో

అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నారి నాయనమ్మ పార్వతి సమీపంలో ని అపార్టుమెంట్ వద్దకు ఆడుకునేందుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ నుండి తాము

నివసిస్తున్న విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ ప్రధాన రహదారి లోని శ్రీ సాయి ధరణి ప్లాజా కు చేరుకునేసరికి సినీఫక్కీలో ఓ ఆగంతకుడు ఆమెను కరెంటు ఉందా అంటూ

ప్రశ్నించాడు. వెను వెంటనే ఆమె పై పిడి గుద్దులు గుద్ది గాయ పర్చాడు.వెంటనే బాలుడిని ఎత్తుకుని మోటర్ సైకిల్ పై బాబు ను ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న టౌన్

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు దీంతో పోలీసులు ఎలార్ట్ అయ్యారు. ప్రతి చోటా జల్లెడ పట్టారు. ఒక్క ప్రాంతాన్ని కూడా వదలకుండా సోదాలు నిర్వహిస్తున్నారు.

బాలుని ఆచూకీ   సమాచారం తెలిసిన వారు 7928238102 నంబర్ à°•à°¿ తెలియచేయమని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam