DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు : ఆర్ అండ్ బి మంత్రి అయ్యన్న పాత్రుడు

మంత్రుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ఆర్ అండ్ బి మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు

నర్సీపట్నం మే 17, 2018 (DNS Online): 19 వ తేదీ శుక్రవారం పట్నంలో అభివృద్ధి కార్యక్రమాలకు

శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసేందుకు రాష్ట్ర మంత్రులు వస్తున్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు

అధికారులను ఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు,

క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నర్సీపట్నంలో శారదానగర్ రోడ్డు అభివృద్ధి, ఇండోర్ స్టేడియం లకు శంకుస్థాపన స్కేటింగ్ రింక్ ప్రారంభోత్సవం చేయనున్నారు

అన్నారు. పోలీసు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల సమన్వయంతో ఎటువంటి లోపాలు

లేకుండా పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని చెప్పారు. సభాస్థలి ఏర్పాట్లు, వేదికపై ప్రోటోకాల్

ఏర్పాట్లను పర్యవేక్షించాలని, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కే సూర్యరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి.

మహాలక్ష్మి, తాసిల్దార్ లు బి.వి.రమణ, అంబేద్కర్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, వ్యవసాయ శాఖ ఏడి, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు

తదితరులు పాల్గొన్నారు

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam