DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2015 గోదావరి పుష్కరాల ఘటన పై సబ్ కమిటీ తో విచారణ  : మంత్రి వెల్లంపల్లి   

29 మంది మృత్యువాత కారకులను వదిలేది లేదు :మంత్రి వెల్లంపల్లి   

కేబినెట్‌ సబ్‌కమిటీతో విచారణ చేయిస్తాం

ఏపీ అసెంబ్లీ లో వాడి వేడిగా చర్చ

:

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . . . 

అమరావతి, జులై  24, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—ోదావరి పుష్కరాల సందర్బంగా 2015 జులై 14 à°¨ రాజమహేంద్రవరం లో జరిగిన ఘటన కు బాధ్యులు మాజీ ముఖ్యమంత్రి

చంద్ర బాబు నాయుడేనని అధికార పార్టీ శాసన సభ్యులు మండిపడ్డారు. బుధవారం రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో గోదావరి పుష్కరాల ఘటనపై వాడి వేడి గా చర్చ జరిగింది. ఈ ఘటన లో 29

మంది అమాయక భక్తులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరల సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,

తదితరులు ఆవేదనతో మాట్లాడారు.  

కేబినెట్‌ సబ్‌కమిటీతో విచారణ చేయిస్తాం : 

29 మంది భక్తులుమృత్యువాత కు కారణమైన వదిలి పెట్టె ప్రసక్తే లేదని, ఈ దుర్ఘటన

పై 
కేబినెట్‌ సబ్‌కమిటీతో విచారణ చేయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.  à°¸à°­à±à°¯à±à°² ప్రశ్నలకు సమాధానంగా అయన మాట్లాడుతూ.. చంద్రబాబు

నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్‌ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. à°† నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం

తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన

ఘాట్‌కు చంద్రబాబు రావడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు వెల్లడించారు. కేబినెట్‌ సబ్‌కమిటీ ద్వారా à°ˆ ఘటనపై విచారణ

జరిపిస్తామన్నారు.

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే . .  .  :

నాటి ముఖ్యమంత్రి  à°šà°‚ద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు

చనిపోయారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ని తీసుకువచ్చి గోదావరి లో భారీ సెట్టింగ్ లతో సినిమా తరహా లో à°’à°•  à°ªà±†à°¦à±à°¦

స్టెంట్ చేశాడన్నారు. ఒక్క సారిగా గేట్లు తీసే సమయానికి ప్రజలంతా ఒకేసారి గోదావరి లోకి ప్రవేశించాలి అని చెప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అప్పడి నుంచి

ఇప్పడి వరకూ à°† బాధితులకు కనీసం పరామర్శ కూడా చేయలేదన్నారు.  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• శాఖ ద్వారా నేషనల్‌ జియో గ్రాఫిక్‌ ఛానల్‌కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం

చేశారు.  à°²à°•à±à°·à°²à°¾à°¦à°¿ మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణమని విమర్శించారు. పైగా భక్తుల

తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని à°—à°¤ ప్రభుత్వం సమర్ధించుకుందని గుర్తుచేశారు. à°ˆ ఘటనకు సోమయాజులు కమిషన్‌ నివేదనకు పట్టించుకోలేదన్నారు. బాధితులకు

ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. à°ˆ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. 

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం

చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam