DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లలని తీర్చి దిద్దవలసిన భాద్యత వార్డెన్లదే.. : కలెక్టర్ వినయ్ చాంద్ 

స్టాక్ రిజిస్టర్ రోజు వారీగా వ్రాయాలి 

తరగతి గదులు, మరుగుదొడ్లు లో లైటింగ్ పెంచుకోవాలి

 à°•à°²à±†à°•à±à°Ÿà°°à± వినయ్ చంద్ వార్డ్ న్లకు ఆదేశం

(రిపోర్ట్ :

సాయిరాం CVS , Burearu, ) . . .

విశాఖపట్నం, జులై  25, 2019 (డిఎన్‌ఎస్‌) : హాస్టల్ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దవలసిన భాద్యత మీదేనని వసతి గృహాల

వార్డెన్ల కు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ సూచించారు. గురువారం రాత్రి కె. కోటపాడు మండలం ఎ. కోడూరులోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహం ను ఆయన

సందర్శించారు. అక్కడే బస చేసి, విద్యార్థులతో మాట మంత్రి జరిపారు. వారు చదువుతున్న తరగతుల్లోని పాఠ్యాంశాలపై విషయాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో మమేకమై,

వారి విద్య సంపత్తిని విచారించారు. అనంతరం వసతి గృహాన్ని పరిశీలించి వార్డెన్లకు తగు సూచనలు చేసారు. స్టాక్ రిజిస్టర్ రోజు వారీగా వ్రాసుకోవాలని, మరుగుదొడ్లు

పరిశీలించి అక్కడ లైటింగ్ చాలలేదని లైటింగ్ పెంచాలని à°¡à°¿à°¡à°¿ జయప్రకాశ్ ను ఆదేశించారు. నీటి సౌకర్యం కూడా మెరుగు పరచాలన్నారు.  à°…నంతరం స్టోర్ రూం ను సందర్శించి

అక్కడ ఉన్న స్టాక్ వారీగా రిజిస్టర్ పరిశీలించి రిజిస్టర్ మెంటెనెన్స్ బాగాలేదని రోజువారీగా వ్రాసుకోవాలని వార్డెన్లను ఆదేశించారు.  à°…నంతరం అక్కడ నుండి 9à°µ

తరగతి విద్యార్థుల రీడింగ్ రూంకు వెళ్లి మధ్యాహ్నం భోజనం ఏమేమి పెడుతున్నారని విద్యార్థులను అడుగగా వైట్ రైస్, ఆకు కూర, సాంబారు, అరటి పండు, పెరుగు పెట్టి నట్లు

చెప్పారు. గుడ్డు పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నైట్ డ్రస్ బాగుందా లేదా అని విద్యార్థులను అడుగగా బాగా ఉన్నాయని

విద్యార్థులు చెప్పారు. జీవ శాస్త్రం లోని విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబు లు తెలుసుకున్నారు. ట్యూటర్లు వస్తున్నారు లేదా, ఏ ఏ సబ్జెక్టు లకు వస్తున్నారని

విద్యార్థులను అడుగగా లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు లకు వస్తున్నట్లు విద్యార్థులు చెప్పారు. ఇంగ్లీషు సబ్జెక్టు విద్యార్థి చే చదివించారు. క్లాస్ రూంలో లైటింగ్

పెంచాలని, వైట్వాస్ వేయమని డిడి ని ఆదేశించారు. నోట్ పుస్తకాలు, స్కూల్ డ్రస్సులు, నైట్ డ్రస్సులు అందాయ లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కస్టపడి

చదివి మంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలని చెప్పారు సబ్జెక్టు ల్లో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని చెప్పారు. పదవ తరగతి విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి బాగా

చదువుతున్నారా లేదా, అన్ని సబ్జెక్టు లు అర్థం అవుతున్నాయా లేదా అర్థం కాకపోతే చెప్పాలన్నారు. విద్యార్థులకు ఆర్. ఓ. ప్లాంట్ ఏర్పాటు చేయాలని , క్లాస్ రూంలో, మరుగు

దొడ్లలో లైటింగ్ పెంచాలని డిడిని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు లెక్కలు, సైన్స్, హిందీ సబ్జెక్టు లకు ట్యూటర్లు ఏర్పాటు చేయాలని డిడిని ఆదేశించారు. జిల్లా

జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ పదవ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లి వారికి ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్, సోసల్ సబ్జెక్టు లు చెప్పి వారి కి ప్రశ్నలు వేసి జాబులు

రాబట్టారు. అన్ని తరగతి గదులను సందర్శించి లోపాలను డిడికి సరిచేయమని ఆదేశించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam