DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమర వీరుల త్యాగఫలాన్ని దేశం ఎన్నడూ మరిచిపోదు : BJP

కార్గిల్ విజయం భారత సైన్యానికి వెయ్యి రేట్ల మనో ధైర్యాన్ని ఇచ్చింది. 

వాజపేయి సుదూరాలోచన తోనే కార్గిల్ విజయం : బీజేపీ 

భారత సైన్యానికి సంపూర్ణ

అధికారాలు ఇచ్చింది బీజేపీ నే. 

పాక్ కు చుక్కలు చూపిన భారత సైన్యానికి అభినందనలు   

కార్గిల్ విజయం లభించి 20 ఏళ్లు  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, )  . 

.

విశాఖపట్నం, జులై  26, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°•à°¾à°°à±à°—ిల్ విజయం తో భారత సైన్యానికి వెయ్యి రేట్ల మనోధైర్యం వచ్చిందని మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా

మోర్చా ఇంచార్జి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కార్గిల్ విజయం లభించి 20 ఏళ్లు అయినా  à°¸à°‚దర్బంగా నగర బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన పునశ్చరణ సమావేశంలో ఆమె

ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనాటి సంఘటనలు, భారత సైన్యం చూపించిన తెగువలను ఆమె మననం చేసుకున్నారు. కార్గిల్ యుద్ధం లో వీర మరణం పొంది అమరులైన వారి

త్యాగాలను à°ˆ భారత దేశం ఎన్నడూ మరిచిపోదన్నారు.  à°­à°¾à°°à°¤ దేశ చరిత్రలో పాకిస్తాన్ తో జరిగిన అన్ని యుద్దాలు à°’à°• ఎత్తు అయితే కార్గిల్ యుద్ధం à°’à°• ఎత్తు అన్నారు.

ఉగ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ సైన్యమే భారత్ లోకి అక్రమంగా చొరబాటు కు ప్రయత్నించడంతో నాటి భారత ప్రధాని అటల్ బిహారి వాజపేయి సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛ

ఫలితంగా పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో పోరాటాన్నే చేసిందన్నారు. దీని ప్రభావంతో ఎందరో వీరులు అమరులు అవుతున్న, మొక్కవోని దీక్షతో ఆర్మీ, నావికాదళం, వైమానిక

దళాలు పూర్తి స్థాయిలో పోరాటాన్ని చేసి దేశానికి అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు. ఇదే స్ఫూర్తిగా భారత సైన్యం ఇటీవల జరిగిన పుల్వామా దాడిని సైతం

సమర్ధవంతంగా త్రిప్పికొట్టగలిగిందన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం మాజీ ఎంపీ కె. హరిబాబు, విశాఖ నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర,

రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువ మోర్చ ఆధ్వర్యవం లో పాలొవురు యువకులు

పార్టీలో చేరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam