DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వలస వాసుల వివరాలు ప్రభుత్వం రికార్డుల్లో చేర్చాల్సిందే :  జేసీ శివ శంకర్

అధికారులకు సంయుక్త కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు 

స్వచ్చంద సంస్థలు భాద్యతలు తీసుకోవాల్సి : హైమావతి 

రిపోర్ట్ : B V సత్య గణేష్ , స్టాఫ్  à°°à°¿à°ªà±‹à°°à±à°Ÿà°°à± ). .

విశాఖపట్నం, జూలై 26 , 2019 (డిఎన్‌ఎస్‌) : జిల్లా వ్యాప్తంగా ఉన్న వలస కుటుంబాల బాలల వివరాలను ప్రభుత్వ శాఖలకు చేర్చాల్సిన భాద్యత ఆయా శాఖలదేనని జిల్లా సంయుక్త

కలెక్టర్ ఎల్. శివ శంకర్ తెలిపారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ వచ్చే నెల 1వ తేదీన జిల్లాకు రానున్న సందర్భంగా శుక్రవారం అధికారులు, జిల్లాలో ఆయా ఎన్.జి.ఓ.

సంస్థలతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్.జి.ఓ. సంస్థలు ముందుగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రభుత్వ శాఖల్లో ఏ ఏ

పథకాలు ఉన్నవి తెలుసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, డ్రాపౌట్లు అరికట్టాలని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి వలసలు వచ్చిన పిల్లలే యాచకులుగా మారుతున్నట్లు

చెప్పారు. వారు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చింది తెలుసుకొని à°† ప్రాంతాల కలెక్టర్లకు లేఖలు తయారు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ  à°‰à°ª సంచాలకులు జయ ప్రకాశ్ మరియు బి.సి.

సంక్షేమాధికారి కె. శ్రీదేవిలను ఆదేశించారు. వారు ఏ కులానికి చెందినవారో గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నెలలో ఒక

రోజు  à°¬à°¾à°²à°² హక్కుల పరిరక్షణ గూర్చి సమావేశమై సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఎన్.జి.à°“. సంస్థల తెలిపిన సమస్యలపై పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాలల

హక్కుల సమస్యలు పై దరఖాస్తు చేసుకోవచ్చని తెలియచేసారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్ పర్సన్ జి. హైమావతి మాట్లాడుతూ కమీషన్ దృష్టికి

పిల్లలకు సంబంధించి సమస్యలపై దరఖాస్తు ద్వారా తెలపాలని చెప్పారు.  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾ లేదా వారి తల్లిదండ్రులచేతనైనా దరఖాస్తులు పంపవచ్చునని తెలిపారు.  à°•à±à°·à±‡à°¤à±à°°

స్థాయిలో à°ˆ సమాచారం అందాలని చెప్పారు.   ఒరిస్సా, తదితర రాష్ట్రాల నుండి పిల్లలు వస్తున్నారని, ఏ సమస్యల వలన వచ్చేస్తున్నారని, ఆర్థిక సమస్యలపైన లేదా మరే ఇతర

సమస్యలపైనా తెలుసుకొంటే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.  à°•à±Šà°¨à±à°¨à°¿ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని వాటిని అధికారులు, ఎన్.జి.à°“.

సంస్థలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. à°ˆ సందర్భంగా ఆయా ఎన్.జి.à°“.లు వారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.  

     à°…నంతరం విలేఖరులతో జాయింట్ కలెక్టర్

మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కు సంబంధించిన అన్ని విషయాలను కమీషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పిల్లల హక్కులకు సంబంధించిన దరఖాస్తులు ఇస్తే తగు

చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.  à°ˆ సమాచారం ప్రజల్లోకి వెల్లాల్సిన అవసరం ఉందన్నారు.  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్ పర్సన్ జి. హైమావతి

మాట్లాడుతూ బాలల హక్కులపై క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు à°ˆ  à°¸à°®à°šà°¾à°°à°‚ వెల్లాల్సి ఉందన్నారు.  à°ªà°¿à°²à±à°²à°²à± ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని

తెలియజేయాలన్నారు.  à°ªà±à°°à°¤à°¿ నెలలో à°’à°• రోజున బాలల హక్కుల పరిరక్షణ గూర్చి à°’à°• సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యలపై చర్చించుకోవచ్చని చెప్పారు.  à°ˆ సమావేశంలో ట్రైనీ

కలెక్టర్ ప్రతిష్ట, డిఎంహెచ్ఓ తిరుపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వి. జయప్రకాష్, బి.సి. సంక్షేమ శాఖాధికారి కె.శ్రీదేవి, ఎన్సిపిసిఆర్ సభ్యులు కె.

అప్పారావు, పి.వి.వి. ప్రసాద్, ఐ.సి.డి.సి ప్రాజెక్టు డైరక్టర్ విజయ, డిఇఓ లింగేశ్వర రెడ్డి, పబ్లిక్ హెల్త్ నుండి ఇఇ కె. శ్రీనివాసరావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి పి.

వెంకటేశ్వరరావు, ఎన్.జి.ఓ సంస్థల నుండి జనరేషన్ యువ, స్రవంతి ఆర్గనైజేషన్, వరల్డ్ విజన్, వికాష్, ఛైల్డ్ లైన్, పవర్, నేచర్, ప్రేమ సమాజం, థింసా, తదితర సంస్థలు

పాల్గొన్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam