DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరిశ్రమల ఏర్పాట్లులో నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి : కలెక్టర్ వినయ్ చంద్

పిఎంఇజిపి క్రింద శత శాతం యూనిట్లు గ్రౌండ్ కావాలి

ఎస్.సి., ఎస్.టి.లకు రూ. 44.80 లక్షలు ప్రోత్సాహకాలు

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ . .

విశాఖపట్నం, జూలై 26 ,

2019 (డిఎన్‌ఎస్‌) :  à°šà°¿à°¨à±à°¨, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటులో యువతకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్ పిలుపు నిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ

మందిరంలో పిఎంఇజిపి కార్యక్రమం అమలుపైన, కెవిఐబి (ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి), కెవిఐసి (ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్), జిల్లా పరిశ్రమల శాఖలతో ఆయన

సమావేశం నిర్వహించారు.  
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం క్రింద ప్రభుత్వం నిర్ణయించిన మేర శత శాతం యూనిట్లు గ్రౌండ్ కావాలని

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార మరియు సేవా పరమైన యూనిట్లు / ప్రాజెక్టులు

ఏర్పాటు చేయుటకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ యేడాదికి ఎన్ని యూనిట్లు లక్ష్యమని కలెక్టర్ అడుగగా 136 యూనిట్లని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్

రామలింగరాజు తెలిపారు.  à°‡à°‚à°¤ వరకు ఎన్ని ధరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ప్రశ్నించారు. 315 దరఖాస్తులు వచ్చాయని జియం, డిఐసి చెప్పారు.  à°µà±€à°Ÿà°¿à°²à±‹ అర్హత గలవి 209 దరఖాస్తులు

ఉన్నట్లు జియం తెలిపారు. ఇందులో మేన్యూఫేక్చర్ ఎన్ని, సర్వీసెస్ కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ఆయన అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు తమ యొక్క వివరాలు నిర్ణీత

దరఖాస్తుతో పాటు ప్రాజెక్టు రిపోర్టు విద్యార్హతలు, రేషన్ కార్డు, సాంకేతిక విద్యార్హతలు, కుల దృవీకరణ పత్రాలతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటోలతో సంబంధిత

కెవిఐసి/కెవిఐబి/డిఐసి  à°²à±‡à°¦à°¾ దగ్గరలో à°—à°² బ్యాంకులలో సమర్పించవచ్చునని సహాయ సంచాలకులు శ్రీనివాసరావు కలెక్టర్ కు వివరించారు. అర్హత à°—à°² 209 యూనిట్లకు మార్జిన్మని

రూ.14.71 కోట్లు కాగా,  à°·à±†à°¡à±à°¯à±‚లు కులాల వారికి ఇండస్ట్రియల్ ఇన్ సెంటివ్  à°•à°¿à°‚à°¦ 35 యూనిట్లకు రూ.44.80 లక్షలు మంజూరు చేయబడుతుందన్నారు.  à°¸à°¦à°°à± యూనిట్లు శత శాతం గ్రౌండ్

కావాలని ఆయన ఆదేశించారు. బ్యాంకర్స్ గ్రామీణ ప్రాంతాల్లో యువతను పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించేందుకు ఆయా బ్యాంకులకు దరఖాస్తులు ఇవ్వాలని లీడ్ బ్యాంక్

మేనేజర్ ను ఆయన ఆదేశించారు.  à°ˆ కార్యక్రమం క్రింద పరిశ్రమల స్థాపనకు మహిళా సంఘాలు, ట్రస్ట్ల్, రిజిష్టర్డ్ బాడీలు కూడా ముందుకు రావచ్చని తెలిపారు.  à°ˆ సమావేశంలో

జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగరాజు, లీడ్ బ్యాంకు మేనేజర్ వై. శ్రీనాథ్ ప్రసాద్, కెవిఐసి నుండి శ్రీనివాసరావు, కెవిఐబి నుండి కె. వెంకటరమణ, తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam