DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జషీత్ దొరకటంలో సహకరించిన వారందరికి అభినందనీయం :

మీడియా, సోషల్ మీడియా à°² పాత్ర విస్తృతంగా పెరిగింది. 

ఉప ముఖ్యమంత్రి పిల్లి సుబోసు చంద్ర బోస్ .      

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్

అమరావతి). . . 

అమరావతి, జులై  27, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా మండపేట గ్రామంలో 
ఈ నెల 23 న కిడ్నాప్ అయిన జషిత్ సురక్షితంగా తిరిగి రావడం లో కృషి చేసిన

పోలీసు యంత్రాంగం, మీడియా, సోషల్ మీడియా సహా అందరికీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుబోసు చంద్ర బోస్ అభినందించారు. శనివారం మండపేట

గ్రామానికి వచ్చిన అయన జషిత్ ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. వారికి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఈ ఘటనతో 60 గంటల

పాటు తల్లిదండ్రులు, బంధువులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ యావత్ రాష్ట్రమంతా ఏంతో ఉత్కంఠకు లోనయ్యారన్నారు. జషిత్ తో కాసేపు ముచ్చటించారు. మీడియా, సోషల్ మీడియాల్లో

విస్తృతంగా సమాచారం రావడంతో బాలుడు అపహరణకు గురైన సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా విస్టరించిందన్నారు. ప్రస్తుతం మీడియా కు ధీటుగా సోషల్ మీడియా కూడా

విస్తరిస్తోందన్నారు. à°ˆ మూడురోజుల పాటు ఏ సోషల్ మీడియా లో చూసినా జషిత్ గురించిన సమాచారమే ఉందన్నారు. 
ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు యంత్రాంగం అప్రమత్తమై

పూర్తి విచారణ చేయడం జరుగుతుందని దోషులను పట్టు కోవడంలో ఎటువంటి జాప్యం లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మొత్తం 17 à°ªà±‹à°²à±€à°¸à± టీములు

పనిచేస్తున్నాయని త్వరలో వారిని పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా పోలీస్ ఎస్ పి నయీమ్ మూడు రోజులు మండపేటలోనే  à°‰à°‚à°¡à°¿ అన్ని కోణాల నుండి పరిశీలించి తగు

విచారణకు పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఊరు చివరిలో నివాసం ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆగంతుకులు కనపడితే సమాచారం ఇవ్వాలని

సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam