DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్యం, విద్యలకె ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత : మంత్రి ముత్తంశెట్టి 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో లోపాలు సహించేది  

పర్యాటక క్రీడల శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు

సీఎం ఆదేశాల మేరకే తనిఖీలు : విఎంఆర్డిఎ అధ్యక్షులు

ద్రోణంరాజు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . . . .

విశాఖపట్నం, జులై  27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆసుపత్రులు, విద్యాలయాల్లో ఎటువంటి లోపాలను సహించబోమని రాష్ట్ర పర్యాటక క్రీడల

శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆయన వి ఎం ఆర్ డి ఎ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాస్ తో కలిసి వన్ టౌన్ లో గల విక్టోరియా ఘోష

ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డు లోనికి వెళ్లి గర్భిణులకు ఇచ్చిన ఆహారాన్ని తిని చూసారు. అన్నం కూరలు వేడిగా లేవని కాంట్రాక్టర్ ను

ఇన్చార్జ్ సూపరింటెండెంట్ వై ఎల్ నరసింహారావును అడుగగా ఆసుపత్రిలోని వంటగది మరమ్మతుల్లో ఉన్నదని, వేరొక ఆసుపత్రిలో వండించి ఇక్కడకి తీసుకొస్తున్నట్లుగా

వారు తెలిపారు. వంటగదిని త్వరగా చేయించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. వేడివేడిగా ఉండగానే ఆహారపదార్థాలను రోగులకు అందించాలని, వైద్యులు ప్రతిరోజు

ఆహారాన్ని పరీక్ష చేయాలని ఆదేశించారు. మంత్రి గర్భిణులను ప్రశ్నించగా వైద్య సేవలు బాగుంటున్నాయని, కానీ కూరలు ఉప్పగా ఉంటుందని చెప్పారు. మరొకసారి ఫిర్యాదు

వచ్చినట్లయితే ఉపేక్షించేది లేదని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. 
వి.యమ్.ఆర్.డి.ఎ. అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో ఎక్కడైనా

లోపం ఉన్నట్లు తెలిసినట్లయితే వెంటనే వెళ్లి తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తాము తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు ఆహారంపై

స్థానిక పత్రికల్లో వచ్చిన వార్త ప్రకారం వెంటనే స్పందించి  à°µà°šà±à°šà°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. చారిత్రాత్మకమైన à°ˆ ఆసుపత్రిలో సేవలలో ఎటువంటి లోపాలు జరగదన్నారు. ఆసుపత్రి ఇన్చార్జ్

సూపరిండెంట్ డాక్టర్ వై ఎల్ నరసింహారావు సిఎస్సార్ విద్యాధికారిణి డాక్టర్ శ్యామల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam