DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి జలాలు: పురుషోత్త పట్నం ఎత్తిపోతల నుంచి విశాఖ కు

పురుషోత్త పట్నం ఎత్తిపోతల పధకం వద్ద పనులు ప్రారంభం  

రానున్న ఏడాది వరకూ నీటి ఇబ్బంది లేదు: కమిషనర్ 

 (రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . .

విశాఖపట్నం, జులై

 30, 2019 (డిఎన్‌ఎస్‌) : మహా విశాఖ నగర పాలక సంస్థ ( జివిఎంసి) ప్రజల మంచి నీటి అవసరాల సమస్య పరిష్కారానికై పురుషోత్త పట్నం ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి జలాలను విడుదల

చేసినట్టు కమిషనర్ జి. సృజన తెలిపారు. నగరానికి ప్రధాన నీటి వనరులైన రైవాడ, మేహాద్రి గెడ్డ తాటిపూడి జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి పోవడం తో ప్రజల మంచి నీటి

అవసరాల కోసం గోదావరి, ఏలేరు జలాశయాల పై ఆధార పడవలసి వస్తోందన్నారు. ప్రస్తుతం నగర పరిధిలోని జలాశయాలు వర్షాభావ ప్రభావం తో అడుగంటిపోవడం తో పురుషోత్తపట్నం

ఎత్తిపోతల పధకం ద్వారా పంపింగ్ చేసి ఏలేరు జలాశయాన్ని నింపేందుకు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, నీటి పారుదల

శాఖా మంత్రి అనికుమార్ లు స్పందించడం తో నగర ప్రజల నీటి  à°…వసరాలు తీర్చేందుకు పర్యాటక శాఖా మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాస రావు, మునిసిపల్ శాఖా మంత్రి బొత్స

సత్యనారాయణలు చొరవ తీసుకోవడంతో అధికారులు ఈ నెల 27 న పురుషోత్త పట్నం ఎత్తిపోతల పధకం నుంచి నీటి పంపింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలియచేసారు. తద్వారా

రానున్న ఏడాది కాలం వరకూ మహా విశాఖ నగర ప్రజల త్రాగు నీరు, పరిశ్రమలకు వినియోగ నీరి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam