DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విత్తనాలతో రాఖీలు. . . అందరికీ ఆహ్లాదం :విజయ్ కుమార్ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, )

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  30, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రతి పండుగానూ పర్యావరణ సహాయకారిగా నిర్వహించుకుందామని ప్రముఖ పారిశ్రామిక వేత్త, పర్యావరణ

పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు. మంగళవారం నగరం లోని మజ విశాఖ నగర ప్రాధమికోన్నత పాఠశాలలోని చిన్నారులకు పర్యావరణ హిత రాఖీల తయారీ పై

పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు నిర్వహించిన అవగానే శిబిరానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్లాస్టిక్, ఇతర కెమికల్ ఉత్పత్తులతో

కాకుండా పర్యావరణ హిత విత్తనాలతో రాఖీలను తయారు చేసి రానున్న శ్రావణ పౌర్ణమికి అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ విత్తనాలను పండుగ అనంతరం ఇంటి

ఆవరణ లో నాటి నట్టయితే విత్తనాలు మొక్కలుగా రూపు దాలుస్తాయన్నారు. ఇతర ప్రయోజనాలను చూడకుండా, కేవలం విత్తన సరఫరా చేస్తే ప్రజలకు అంతగా రుచించదని, విద్యార్థులలో

అవగాహనా కల్పిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందుతుందన్నారు. ప్రతి ఇంటిలోనూ కనీసం రెండు మొక్కలు పెంచాలి అనే సంకల్పనతో తాము ముందుకు కదులుతున్నారన్నారు.

అనంతరం బాల బాలికలతో విత్తనాల  à°¦à±à°µà°¾à°°à°¾ రాఖీలు తయారు చేసే విధానాన్ని తెలియచేసి, వారితో కొన్ని తయారు చేయించారు. కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు, పర్యావరణ రక్షణ

సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam