DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి అర్చకుల శిక్షలు మాకు వెయ్యద్దు :ఉత్తరాంధ్ర అర్చక సంఘం

టిటిడి తో మాకు సంబంధం లేదు : ఉత్తరాంధ్ర అర్చక సంఘం
రాజకీయం కోసమే రమణ దీక్షితుల ప్రవర్తన : వ్యవహారం పై అర్చక సంఘాల మండిపాటు.

విశాఖపట్నం, మే 18, 2018 (DNS Online) :  à°¤à°¿à°°à±à°®à°²

తిరుపతి దేవస్థానం పరిధి లో పనిచేసే దేవాలయాల అర్చకులతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి అయిలూరి శ్రీనివాస దీక్షితులు

ప్రకటించారు. శుక్రవారం విశాఖనగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అర్చకుల సంక్షేమం కోసం తమ

సంఘం పోరాటం చేస్తోందని, తాము కష్ట కాలం లో ఉండగా టిటిడి, అన్నవరం, సింహాచలం, వంటి ఆలయాల అర్చక సంఘాలు సంఘీభావం ప్రకటించడం గానీ, ఆదుకోవడం గానీ చేయక పోగా కనీసం

పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పూర్తిగా రాజకీయ కోణం లోనే పొరుగు రాష్ట్రం లో

ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆలయ వ్యవస్థ పై ఆరోపణలు చేశారన్నారు. వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని, అది పూర్తి గా టిటిడి అంతర్గత వ్యవహారమే అన్నారు. అయితే అయన చేసిన

వ్యాఖ్యల కారణం గా రాష్ట్రం లోని ఇతర చిన్న, పెద్ద ఆలయాల అర్చకుల పై విపరీత ప్రభావం పడుతోందన్నారు. దేవాదాయ శాఖ లో ఉన్న నిరంకుశ వైఖరి కారణం గా తీసుకునే నిర్ణయాలు,

చిన్న స్తాయి అర్చకుల జీవితాలకు నరక ప్రాయం చూపుతోందన్నారు. రమణ దీక్షితుల పై చర్యలు తీసుకునే క్రమం లో భాగం అర్చకుల పదవీ విరమణ 65 ఏళ్ళు గా టిటిడి పాలక మండలి

నిర్ణయించడం తో , దీన్నే రాష్ట్రం లోని అన్ని  à°†à°²à°¯à°¾à°²à°•à±‚ అమలు చెయ్యాలని ప్రభుత్వం భావించడం తో తమకు తీరని అన్యాయం జారుతుందన్నారు. దీన్ని తాము

వ్యతిరేకిస్తున్నామన్నారు. 
నవ్యంధ్ర  à°…ర్చక సంఘం అధ్యక్షులు కొత్తలంక మురళి కృష్ణ మాట్లాడుతూ దేవాదాయశాఖ తీసుకుంటున్న à°ˆ నిర్ణయం ప్రభావం ఇప్పడికే

రాష్ట్రం లోని గ్రామాల్లో పైరవీలకు దారి తీసిందన్నారు. అర్చకుల వయసు 60 దాటినా ఆలయాల్లోని ఆలయ కమిటీలు, ఇతర అధికారులు, రాజకీయ ప్రతినిధులు బ్లాక్ మెయిల్

మొదలెట్టేశారన్నారు. మీకు ఉద్యోగం కావాలంటే ఇంత ముడుపులు చెల్లించాలి అంటూ అర్చకులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని, ఆలా ముడుపులు చెల్లించని వారిని తక్షణం

ఇంటికి పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని మండి పడ్డారు. 
దీనిపై రాష్ట్ర అర్చక సంఘాల అధ్యక్షులు, బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య

అర్చకులకు ఎటువంటి అన్యాయం జరుగకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ విలేకరుల సమావేశం అర్చక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam