DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంస్కార హీనులకు  జై శ్రీరామ్ అంటే ఉగ్రవాద నినాదంగా ఉందా

సంస్కార హీనులకు  à°œà±ˆ శ్రీరామ్ అంటే ఉగ్రవాద నినాదంగా ఉందిట 

అసహన వాదుల దిష్టిబొమ్మలు దగ్ధం  

తక్షణం హిందువులకు క్షమాపణ

చెప్పాల్సిందే. 

వీళ్ళ పేర్లన్నీ శ్రీరాముడివే. . . .

మండిపడ్డ జన జాగరణ సమితి సభ్యులు    

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ).

.

విశాఖపట్నం, జులై  31 , 2019 (డిఎన్‌ఎస్‌): సంస్కార హీనులకు జై శ్రీరామ్ అనే నినాదం దేశంలో అల్లర్లు రేకెత్తించే ఉగ్రవాద నినాదం à°—à°¾ కనిపిస్తోందని జనజాగరణ సమితి

సభ్యులు మండిపడుతున్నారు. బుధవారం విశాఖ నగరం లోని జివిఎంసి కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు వాసు

మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా హిందూ ధర్మం పై బురద జల్లే కార్యక్రమాన్ని కొన్ని దుష్ట శక్తులు నెత్తికెక్కించుకున్నాయని మండిపడ్డారు. ఒక మనిషి చేపట్టవలసిన

ధర్మాచరణను తానూ ఆచరించి చూపించిన వాడు శ్రీరాముడని, అలాంటి శ్రీరాముని పేరు తలుచుకోడానికే అసహన వాదులు, కొందరు సినిమా ప్రతినిధులు భయపడిపోతున్నారన్నారు. ఆ

భయాన్ని ఎలా చూపించాలో తెలియక శ్రీరాముణ్ణి దూషించే పనిలో పడ్డారన్నారు. ఈ దేశంలో హిందువులపై దండయాత్రలు జరిగినప్పుడు, వేలాదిగా హిందూ ఆలయాలు కూడగొట్టిన ఘటనలూ

 à°ˆ సంస్కార హీనులకు కనపడడం లేదన్నారు. హిందువులపై పట్టపగలే బహిరంగంగా దాడులు జరుగుతుంటే కనీసం ఖండించడానికి కూడా వీళ్ళకి నోరురావడం లేదని, కళ్లుండి కూడా

వీళ్ళు అంధులైపోయారన్నారు.  à°…లాంటిది భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ సమన ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో పధకాలు ప్రకటిస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా దేశ

ద్రోహులకు మద్దతు ప్రకటించిన ఈ సంస్కార హీనులు జై శ్రీరామ్ నినాదం ఈ దేశాన్ని నాశనం చేస్తుందని, ఈ దేశానికి విఘాతం కల్గిస్తుందంటూ లేఖ లు రాయడం వీరికే

చెల్లిందన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళలో వేలాది మంది హిందూ యువతీ యువకులను పట్టపగలే నడిరోడ్లపై హత్యలు చేస్తుంటే, కాశ్మీర్ లో లక్షలాది మంది సుశ్మిర్ పండిట్ లను

ఊచకోత కోసి, రాష్ట్రం నుంచి తరిమి కొట్టినప్పుడు, నక్సల్స్ దాడిలో అమాయక గిరిజనులు మృత్యువాత పాడినప్పుడు, ఈ సంస్కార హీనులు నిద్రపోతున్నారా లేదా కళ్ళున్నా

అంధులై పోయారా అని ప్రశ్నించారు. తక్షణం వీళ్లంతా దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  

వీళ్ళ పేర్లన్నీ శ్రీరాముడివే. . . .

జై

శ్రీరామ్ నినాదాన్ని ఉగ్రవాద నినాదాలుగా అభివరిస్తున్న కుహనా వాదులందరి పేర్లూ శ్రీరాముని సంబంధిత పేర్లేనని వాసు అన్నారు. ముందుగా వాళ్ళ పేర్లు మార్చుకుని

శ్రీరామునికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అపర్ణ (సేన్), రామచంద్ర ( గుహ), సౌమిత్రి  à°¤à°¦à°¿à°¤à°° పేర్లన్నీ శ్రీరాముని సంబంధితమే నన్నారు. 
 
సినీ రంగానికి చెందిన

వాళ్ళు, స్వయం ప్రకటిత మేధావులుగా తమకి తామే బిరుదు లు ఇచ్చుకునే à°ˆ సంస్కార హీనుల చర్యలకు నిరసనగా వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేసినట్టు తెలిపారు. 

వీళ్ళు

దగ్ధం చేసిన దిష్టిబొమ్మల్లో అపర్ణ సేన్, శ్యామ్ బెనెగల్, కొంకణ్ సేన్ శర్మ, రేవతి, మణిరత్నం, రామచంద్ర గుహ, గోపాల కృష్ణన్, అనురాగ్  à°…నురాజ్ కశ్యప్, వినాయక్ సేన్,

సౌమిత్రి ఛటర్జీ తదితరులున్నారు. 

à°ˆ నిరసనలో తిరుపతిరావు,  à°²à±‹à°•à±‡à°·à±, ఉదయ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam