DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21న ఇచ్చాపురం నుండి విశాఖ కు రైల్ యాత్ర : రైల్వే జోన్ సాధన సమితి

విశాఖ రైల్వే జోన్  à°•à±‹à°¸à°‚ ఇచ్చాపురం నుండి విశాఖ రైల్ యాత్ర

ఏటా 7000 కోట్ల ఆదాయం ఇస్తున్నా విశాఖ అంటే చిన్న చూపే 

విశాఖపట్నం, మే 18, 2018 (DNS Online) : ఉత్తరాంధ్ర వాసుల

చిరకాల వాంఛ విశాఖ రైల్వే జోన్ కోసం à°ˆ నెల 21 à°¨ ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకూ రైల్ యాత్రను చేపట్టనున్నట్టు  à°°à±ˆà°²à±à°µà±‡ జోన్ సాధన సమితి ప్రకటించింది. శుక్రవారం

విశాఖపట్నం లో à°—à°²  à°¦à±à°µà°¾à°°à°•à°¾à°¨à°—ర్ లోని పౌర గ్రంధాలయం లో నిర్వహించిన కార్యాచరణ సమావేశం లో à°ˆ విషయాన్ని ప్రకటించారు. à°ˆ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ సిపిఐ రాష్ట్ర

సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రతీ ఏటా సుమారు 7200 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ విశాఖపట్నం డివిజన్ మాత్రమే అందిస్తూ దేశం లోనే అత్యధిక

ఆదాయాన్ని ఇచ్చే రైల్వే డివిజన్లలో మూడవ స్థానం లో ఉందన్నారు. విభజన అనంతరం ఏ పి కి విశాఖ ఆర్ధిక రాజధాని రాష్ట్రం లోని అతి పెద్ద నగరం భారత దేశం లోని రైల్వే కి

అత్యధిక ఆదాయం ఇస్తున్న విశాఖ కు రైల్వే జోన్ అవసరమని జోన్ కు కావలసిన అన్ని వనరులు వున్నా జోన్ ప్రకటనలో కేంద్రం ఉదాసీన వైఖరి సరికాదన్నారు

ఉత్తరాంధ్ర

హక్కుల సాధన సమితి నాయకులు ఆచార్య కె ఎస్ చలం మాట్లాడుతూ గత దశాబ్దాల కాలంగా వివిధ రూపాలలో ప్రజాందోళనలు జరుగుతున్నా కేంద్రం ఆంధ్ర ప్రజలను మరి ముక్యంగా

ఉత్తరాంధ్ర ప్రజలను చిన్న చూపు చూస్తున్నాదని విమర్శించారు. 

వైసీపీ జిల్లా నాయకులు పూర్వ శాసన సభ్యులు తైనాల విజయ కుమార్ మాట్లాడుతూ వాల్తేర్   డివిజన్ కు100

సంవత్సరాల చరిత్ర ఉందని విభజన చట్టం లో 6 మాసాలు లోగా  à°œà±‹à°¨à± ఏర్పాటు చేయాలని వున్నా నేటికి కేంద్రం పట్టించుకోక పోవడం అన్యాయమని అన్నారు

సిపిఎం నగర

కార్యదర్శి బి గంగారావు మాట్లాడుతూ దేశంలో17 జోన్ లు ఉండగా అన్ని జోన్ లలో విశాఖ డివిజన్ పెద్దదని ఆదాయంలో కూడా ముందువున్నదని వెంటనే జోన్ ఏర్పాటు చేయాలని

కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం ఎస్ ఎన్ రాజు,లోక్ సత్తా నాయకులు ఎం ఎస్ ఎన్ మూర్తి ,ఉత్తరాంధ్ర ట్రాన్స్ పోర్ట్ జె ఏ సి నాయకులు జానకి రామ

రెడ్డి, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షులు ఎస్ ఎస్ శివశంకర్, యూ జె ఎఫ్. నాయకులు ఎం ఆర్ ఎన్ వర్మ, ఎన్ ఎన్ ఆర్, రాము సత్యనారాయణ, ఏ యూ విద్యార్థి సంగం నాయకులు సమయం

హేమంత్ కుమార్, ఎస్ తిరుపతి రావు, సిపిఐ జిల్లా నగర కార్యదర్సులు బలే పల్లి వెంకటరమణ, ఎం పైడి రాజు ఏ విమల తదితరులు పాల్గొని 21 రైల్ యాత్ర జయప్రదం చెయ్యాలని ప్రజలకు

విజ్ఞప్తి చేశారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam