DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సనాతన హైందవ సంప్రదాయాన్ని విస్తృత పరుస్తాం :టిటిడి ఛైర్మెన్

ధార్మిక పరీక్షల విజేతలకు బంగారు à°ª‌à°¤‌కాలు : 

టిటిడి ఛైర్మెన్ వై వి సుబ్బారెడ్డి

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ) . . .

తిరుపతి, జులై  31, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¹à°¿à°‚దూ

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక విజ్ఞాన పరీక్షలలో బంగారు, వెండి పతకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిటిడి ధర్మకర్తలమండలి అధ్యక్షులు

 à°µà±ˆ.వి.సుబ్బారెడ్డి చెప్పారు. 
తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యవర్గ సమావేశం లో ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న

37వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రోత్సాహక పురస్కారాలను అందించాలన్నారు.

గతంలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రం, నగదు బహుమతి ఇచ్చేవారని, ఇకపై బంగారు, వెండి పత‌కాలు ఇచ్చేలా నిర్ణయం

తీసుకున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి ప్రథమ బహుమతికి 5 గ్రాముల బంగారు పత‌à°•à°‚, ద్వితీయ బహుమతికి 2 గ్రాముల బంగారు పత‌à°•à°‚, తృతీయ బహుమతికి 1 గ్రాము బంగారు

పత‌à°•à°‚ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలో స్థాయిలో ప్రథమ బహుమతికి 1 గ్రాము బంగారు పత‌à°•à°‚, ద్వితీయ బహుమతికి 10 గ్రాముల వెండి పత‌à°•à°‚, తృతీయ

బహుమతికి 5 గ్రాముల వెండి పత‌à°•à°‚ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక 6,7,8 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం పరీక్షలు నిర్వహించేవారని, వీటితోపాటు ఇకపై 9,10 తరగతుల

విద్యార్థులకు ధర్మప్రవేశిక పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

2019 – 20 సంవత్సరానికి హిందూ ధార్మిక ప్రచార పరిషత్, శ్రీ à°•à°‚à°šà°¿ కామకోటి పీఠం సంయుక్తంగా చిత్తూరు

జిల్లాలోని 16 మండలాలలో పైలెట్ ప్రాజెక్ట్ గా మూడు రోజుల పాటు వేద పారాయణం, హోమం, గోపూజ, తులసిపూజ, వృక్ష పూజ తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయం

తీసుకున్నామన్నారు. హెచ్ డి పి పి ఆధ్వర్యంలో జరుగుతున్న సప్తాహం ( 7 రోజులు) కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ భజన మండళ్ల

కళాకారులకు కిలో మీటరుకు 62 పైసలు చొప్పున సాధారణ బస్సు ఛార్జీలు చెల్లించేందుకు అంగీకరించామన్నారు. అదేవిధంగా హెచ్ డి పి పి ఆధ్వర్యంలో మనగుడి, అర్చక శిక్షణ,

శ్రీవేంకటేశ్వర ధర్మ రథయాత్ర, శుభప్రధం, సనాతన ధార్మిక విజ్జాన పరీక్షలు, సదాచారం, గీతా జయంతి, భక్తులకు పుస్తక ప్రసాదం, అఖండ హరినామ సంకీర్తన తదితర కార్యక్రమాల

ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచారం చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ బోర్డు కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం

ఎస్వీబీసీ బోర్డు ఛైర్మెన్ à°—à°¾ నియమితులైన పృథ్వీరాజ్ మర్యాద పూర్వకంగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మెన్  à°µà±ˆ.వి.సుబ్బారెడ్డిని కలిసారు.

ఈ కార్యవర్గ సమావేశంలో టిటిడి ఈవో

అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో  à°ªà°¿. బసంత్ కుమార్, దేవాదాయ కమీషనర్ à°¡à°¾. పద్మ, హెచ్‌డిపిపి కార్య‌à°¦‌ర్శి à°¡à°¾. à°°‌à°®‌à°£‌ప్ర‌సాద్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam