DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ సొంత డబ్బా కొట్టుకుందుకే అసెంబ్లీ సమావేశాలు : గణబాబు

లక్షలాది ప్రజాధనం వృధా, సభ సమయం వ్యర్థం 

అన్న క్యాంటిన్లను అధోగతి పాలు చేశారు . . . 

:విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు   

(రిపోర్ట్ : సత్య గణేష్,

స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం). . . 

విశాఖపట్నం, ఆగస్టు 01 , 2019 (డిఎన్‌ఎస్‌): లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ అధికార పార్టీ కేవలం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్

మోహన్ రెడ్డి పొడిగేందుకే శాసన సభా సమావేశాలు నిర్వహించారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. గురువారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విశాఖ

పశ్చిమ ఎమ్మెల్యే పిజివిఆర్ నాయుడు ( గణబాబు) మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో శాసన సభ సమయం అంత కేవలం అధికార పార్టీ సొంత డబ్బా కొట్టుకోడానికే సరిపోయిందన్నారు. ఒక్క

విలువైన చర్చ పూర్తిగా జరగలేదన్నారు. 

అన్నా క్యాంటీన్లు  à°…ధోగతి పాలు . .

కేవలం 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించే ప్రయత్నంగా

చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని గత తెలుగు దేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్న క్యాంటినను బుధవారం నుంచి మూసివేయడం అత్యంత బాధాకరమన్నారు. అధికార పార్టీకి ఈ

క్యాంటీన్ల పేరు నచ్చకపోతే రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవచ్చని, అయితే క్యాంటిన్లను కొనసాగించవలసి ఉందన్నారు. దీంతో పేదలకు ఎంతగానో నష్టం

జరుగుతోందన్నారు. 

ప్రతిపక్షానికి కనీస గౌరవం ఇవ్వలేదు :

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు

కనీస మర్యాద కూడా ఇవ్వకుండా అత్యంత నీచంగా చూడడం బాధాకరమన్నారు. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కి సైతం మైక్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.

 à°‡à°¸à±à°• అందుబాటులో లేక లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రజా సంకల్ప యాత్ర లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం చెందాకానీ

తెలిపారు.

à°ˆ సమావేశం లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam