DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగష్టు 16 ఓటర్ల అవగాహన సదస్సులు చేపట్టాలి : విజయానంద్

2020 ఓటర్ల జాబితా పై ఎన్నికల అధికారి సూచనలు  

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయానంద్

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

 à°µà°¿à°¶à°¾à°–పట్నం) . . .

విశాఖపట్నం, ఆగస్టు 01 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°ˆ నెల 16 నుండి సెప్టెంబరు 30 వరకు ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని    à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్య ఎలక్టోరల్

అధికారి విజయానంద్ ఆదేశించారు. 2020 ఓటర్ల జాబితాకు సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమం పై గురువారం వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఈ కార్యక్రమ

నిర్వహణ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఓటర్ల నమోదుకు స్వీప్ కార్యక్రమం యొక్క

వివరాలను పంపాలన్నారు.  

సెప్టెంబరు 1 నుండి 30 వరకు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయి లో బూత్ స్థాయి అధికారులు పరిశీలించాలన్నారు.  à°‡à°‚à°Ÿà°¿à°‚à°Ÿà°¿ పరిశీలనలో

ఓటర్లుగా నమోదు కాని వారు, వేరొక ప్రాంతానికి మారిన వారు, మరణించిన ఓటర్లు ఉంటారు బూత్ స్థాయి అధికారులు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.  à°ªà±‹à°²à°¿à°‚గ్ కేంద్రాలకు

సంబంధించిన సమాచారంను బూత్ స్థాయి అధికారులు సమాచారాన్ని సేకరించాలని, దానిని ఎఇఆర్ఓలు, ఇఆర్ఓలు, డిఇఓలు పరిశీలించాలని పేర్కొన్నారు.  à°…క్టోబరు 15 నాటికి

డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ పబ్లికేషన్ చేయాలని,  15 అక్టోబరు నుండి 30 నవంబరు 2019 వరకు క్లయిమ్స్ మరియు అభ్యంతరాలను స్వీకరించాలన్నారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• అవగాహన కార్యక్రమాలు

నవంబరు 2à°µ తేది మరియు 3à°µ తేదీలలో ఉంటుందని తెలిపారు.  à°†à°²à°¾à°—ె నవంబరు 9à°µ తేది మరియు 10à°µ తేదిలలో ఉంటుందని చెప్పారు.  à°¡à°¿à°¶à°‚బరు 15à°µ తేదీన క్లయిమ్స్ మరియు అభ్యంతరాలను

డిస్పోజ్ చేయాలని పేర్కొన్నారు.  à°«à±ˆà°¨à°²à± పబ్లికేషన్ 2020 జనవరి 1à°µ నుండి 15 తేదీలలో ఉంటుందన్నారు.  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బూత్ స్థాయి

అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయలన్నారు. మీ సేవా కేంద్రాలలో ఎలక్టోరల్ రోల్ కు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉండే విధంగా జాయింట్ కలెక్టర్లు చర్యలు

తీసుకోవాలని ఆయన కోరారు.  à°¸à°¾à°§à°¾à°°à°£ ఎన్నికలకు సంబంధించి ఖర్చుల వివరాలను తెలియజేయాలన్నారు.

     à°ˆ సమావేశం లో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ ఎల్. శివశంకర్

మాట్లాడుతూ బూత్ స్థాయిలో అవగాహన కార్యక్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  à°®à±€ సేవా కేంద్రాలలో ఎలక్టోరల్ గూర్చి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు

చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీలు, బూత్ స్థాయి అధికారులు, తదితరులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమాలకు

సంబంధించి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు.  
     à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ కు హాజరైన ఆర్డీఓలు, ఉప తహసిల్థార్లు తో జె.సి. మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులతొ

సమావేశం ఏర్పాటు చేయాలని, నియోజక వర్గ స్థాయి రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు.  
మీ సేవా కేంద్రాల్లో

ఎలక్టోరల్ రోల్స్ గూర్చి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  à°ˆ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ట, అనకాపల్లి, నర్సీపట్నం

ఆర్డీఓలు సీతారామారావు, గోవిందరావు, ఎలక్షన్ ఉప తహసిల్థార్ రవి కుమార్, ఆయా నియోజక వర్గాలకు సంబంధించి ఉప తహసిల్థార్లు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam