DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యాభివృద్ధి దేశ స్థితి గతులనే మార్చేస్తుంది: గవర్నర్‌

విద్యాభివృద్ధి à°•à°¿ కేంద్రం ఎన్నో ఆవాసాలు ఇచ్చింది. 

మహిళ విద్యార్థులు పరిశోధనలపై  à°¦à±ƒà°·à±à°Ÿà°¿ సారించాలి 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

 à°µà°¿à°¶à°¾à°–పట్నం) . . . .

విశాఖపట్నం, ఆగస్టు 01 , 2019 (డిఎన్‌ఎస్‌): à°µà°¿à°¦à±à°¯à°¾ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పధకాలను అందిస్తోందని

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తెలియచేసారు. రెండు రోజుల విశాఖ నగర పర్యటనకు వచ్చిన అయన గురువారం ఆంధ్ర విశ్వ à°•à°² పరిషత్ ను సందర్శించారు.  à°›à°¾à°¨à±à°¸à°²à°°à±

హోదాలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సుమారు తొమ్మిది దశాబ్దాల విద్య చరిత్ర కల్గిన ఎయు లో చదివే ప్రతి విద్యార్థి

అదృష్టవంతులన్నారు. ఇద్దరు ఉప రాష్ట్రపతులు అందించిన ఘనత ఈ విద్యాలయందేనన్నారు. సర్వ్ పల్లి రాధాకృష్ణన్, ఎం. వెనకయ్య నాయుడు లు ఇదే విద్యాలయంలో అనుబంధం

ఉన్నవారేనన్నారు.  
ఆంధ్ర విశ్వ విద్యాలయం భారత దేశ విద్యా వ్యవస్థకు విశేష కృషి చేసిందని ఆయన కొనియాడారు. భవిష్యత్ లో కూడా ఆంధ్ర విశ్వ విద్యాలయం ఎన్నో విద్యా

కుసుమాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

స్వామి వివేకానంద చెప్పినట్టు విద్య అనేది విజ్ఞానం, మేధస్సు తో పాటు జీవితానికి సమాజానికి ఉపయోగపడే

విధంగా మంచి వ్యక్తిత్వాన్ని à°’à°• గ్రంధాలయంగా చేసుకుని పరిపూర్ణ వ్యక్తిగా తయారు చేసేవిధంగా ఉండాలన్నారు. 

మహిళా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి

సారించాలి :

భారతీయ విజ్ఞాన విభాగం పరిశోధనలు చేపట్టే మహిళా విద్యార్థులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని

గవర్నర్ పిలుపునిచ్చారు. ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్ పరిశోధనల్లో కీలక భాద్యతలు చేపట్టిన వారు మహిళలేనని గుర్తు చేసారు. అదే స్ఫూర్తిగా ఇంజనీరింగ్, సైన్స్

విద్యార్థినులు పరిశోధనలపై అడుగు పెట్టాలన్నారు. 


విశాఖ లో కాలుష్యం అధికమే. . .:

పారిశ్రామికంగా ఎదుగుతున్న విశాఖ నగరం లో కాలుష్యం కూడా అదే స్తాయిలో

పేరుకు పోతోందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కాలుష్యం కారణంగా  à°šà±ˆà°¨à°¾ రాజధాని బీజింగ్ లో మూడు రోజులు విద్య సంస్థలకు సెలవు ప్రకటించారని, అదే రీతిలో భారత  à°¦à±‡à°¶

రాజధాని ఢిల్లీలో కూడా కాలుష్యం విపరీతంగా ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు.

అంతకు ముందు గవర్నర్ ఎయు లోని పలు ఇంజనీరింగ్ కళాశాల లోని స్కిల్ డెవెలప్మెంట్

విభాగాలను పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన కొన్ని నమూనాలను చూసారు. కళాశాల లో మొక్కలు నాటారు. అనంతరం వైవిఎస్ మూర్తి ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమం లో

పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చాంద్, గవర్నర్ కార్యదర్శి ముకేశ్

కుమార్ మీనా, ఎయు ఉపకులపతి డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి,  à°°à±†à°•à±à°Ÿà°¾à°°à± ప్రసాద రావు, రిజిస్ట్రార్ డాక్టర్ కృష్ణ మోహన్, వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్,

అధికారులు, అనధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam