DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉన్నావ్ ఘటన పరిణామాల పై బీజేపీ సిగ్గుపడాలి : బృంద కారత్

తప్పుదారి పట్టించేందుకే కేసును ఢిల్లీ à°•à°¿ మార్చారు  

వైకాపా కు బీజేపీ తో అనధికారిక పొత్తు ఉన్నట్టు ఉంది.. . .

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృంద

కారత్

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . .

విశాఖపట్నం, ఆగస్టు  02, 2019 (డిఎన్‌ఎస్‌): ఉన్నావ్ ఘటన పట్ల భారతీయ జనతా పార్టీ మొత్తం సిగ్గు పడాలని సీపీఎం జాతీయ కమిటీ

సభ్యురాలు బృంద కారత్ మండి పడ్డారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆమె విలేకరుల తో మాట్లాడుతూ ఒక అమాయకురాలైన మైనర్ బాలిక, ఆమె కుటుంబం పట్ల ఉత్తర ప్రదేశ్ లోని యోగి

ఆదిత్య నాద్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నందునే ఈ కేసుకు సంబంధించిన అన్ని కేసులనూ ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ కి తరలించామని సుప్రీం

కోర్టు ఆదేశించిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే ను కథియానంగా శిక్షించాల్సిన బీజేపీ ప్రభుత్వం అతనికి అండగా నిలవడం అతి పెద్ద

ద్రోహమన్నారు. కేవలం అతన్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుందన్నారు. 

ప్రత్యేక హోదా కోసం కేంద్రం తో పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు

చెప్పిందన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°† దిశగా పోరాటం చేస్తున్నట్టు కనపడడం లేదన్నారు. 

ఇంతవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం కనీసం ఒక్క రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం లో అధికారం  à°²à±‹ ఉన్న భారతీయ జనతా పార్టీ లో

వైఎస్ ఆర్  à°•à°¾à°‚గ్రెస్ పార్టీ à°•à°¿ అనధికారిక పొత్తు ఉన్నట్టు à°—à°¾ సంకేతాలు ఇస్తున్నట్టే అన్నారు. దీనికి నిదర్శనమే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టె

ట్రిపుల్ తలాక్ బిల్లు సమర్ధన తెలుపున్నట్టు à°—à°¾ ఓటింగ్ లో పాల్గొనకపోవడమేనన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam