DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు కోసమే జీవిస్తున్న పరవస్తు సూరి కి అభినందనలు

ఆదివారం - ఆటవిడుపు ప్రారంభించిన జెసి శివ శంకర్ 

తెలుగు బడి లో తెలుగు పద్య పఠనం పై ఉచిత శిక్షణ 

(రిపోర్ట్ : కళ్యాణి CSV , రిపోర్టర్, DNS ). . . 

విశాఖపట్నం,

ఆగస్టు  04, 2019 (డిఎన్‌ఎస్‌): పర భాష మోజులో మాతృభాష నిర్లక్ష్యం అవుతున్న తరుణంలో తెలుగు భాష పట్ల చిన్నారులకు అవగాహనా పెంచి తెలుగు భాష పునర్వైభవానికి కృషి చేస్తున్న

పరవస్తు పద్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి సర్వదా అభినందనీయులు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్. శివ శంకర్ తెలిపారు. మద్దిలపాలెం లోని

కళాభారతి పార్కు ఎదురు à°—à°¾ à°—à°²  à°¤à±†à°²à±à°—ుబడి ప్రాంగణం లో నిర్వహించిన ఆదివారం - ఆటవిడుపు కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మధ్యమ

మోజులో పడి  à°¤à±†à°²à±à°—ు భాషను, మాతృ భాష ను నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో తెలుగు భాష, వైభవమే తన ఊపిరిగా జీవిస్తున్న సూరి అందరికీ  à°†à°¦à°°à±à°¶à°‚à°—à°¾ ఉన్నారన్నారు.  à°ˆ నెల 29 à°¨

తెలుగు భాష దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.  

పరవస్తు పద్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి తెలిపారు. శుక్రవారం

మద్దిలపాలెం కళాభారతి సమీపంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ మాతృ భాషపై అభిమానాన్ని. మమకారాన్ని చిన్నారులలో

కల్గించేందుకై  à°ªà°°à°µà°¸à±à°¤à± పద్య పీఠం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి ప్రతి ఆదివారం  “ఆదివారం - ఆటవిడుపు” శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. à°ˆ శిబిరం ఆదివారం

ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుందన్నారు.  
వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలు పిల్లలు ఆదివారం ఆటవిడుపు కార్యక్రమంలో పూర్తిగా ఉచితంగా

పాల్గొనవచ్చునని తెలిపారు.  à°®à°¨ తెలుగు భాష సంస్కృతులను భావితరాలకు తెలియజేయడం కోసం ప్రధాన లక్ష్యంగా à°ˆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. à°ˆ శిబిరంలో

తెలుగు పద్యాలు, గేయాలు, కథలు, జాతీయాల పుట్టుకల గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి పెద్దలకు, పిల్లలకు తెలుగు భాష అంశాలపై, పద్యాలపై

పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేస్తామన్నారు. 

ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ భాషా శిబిరంలో పాల్గొనవచ్చునని తెలిపారు. తెలుగు భాష

శిక్షణా శిబిరం ద్వారా వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో పాల్గొనదలచిన వారు తమ కార్యాలయంలో పేర్లు నమోదు ముందుగా చేసుకోవాలని

లేదా  9963848549, 9052649240 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

మొదటి ఆదివారం సుమారు 100 మంది చిన్నారు పద్య పఠనాసదస్సు లో పాల్గొన్నారు. పలువురు తెలుగు భాష పండితులు,

ఉపాధ్యాయులు చిన్నారులకు తెలుగు పద్యం ఎలా చదవాలి, జాతీయం అంటే ఏంటి, సామెతలు అని వీటిని అంటారు అనే అంశాలను పరిచయం చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam