DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ ఆదర్శం ఈ ఆణిముత్యాలు, : మంత్రి అయ్యన్న పాత్రుడు

నర్సీపట్నం మే 18, 2018 (DNS Online) : అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న ఆణిముత్యాలాంటి ఆడపిల్లలను రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశంసించారు.

శుక్రవారం క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన కాకినాడ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను ఆయన అభినందించారు. నర్సీపట్నం, నాతవరం గ్రామాలకు చెందిన నలుగురు

ఇంజినీరింగ్ విద్యార్థినులు వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచారు. నర్సీపట్నానికి చెందిన సిహెచ్ . సత్య నవ్యశ్రీ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇన్నోవేషన్ టీమ్ లో

పాల్గొన్నారు. 
స్థానిక ఐసిడిఎస్ ఏ పి ఓ జి వి రమణి కుమార్తె. నాతవరం గ్రామానికి చెందిన ఈ స్వర్ణలత ఇంజనీరింగ్ చదువుతూనే జాతీయ కబాడీ పోటీల్లో పాల్గొన్నారు.

పెద్ద బొడ్డేపల్లి కు చెందిన టి అంబికా ఆల్ ఇండియా గేట్ పరీక్షలలో 1750 ర్యాంకును సాధించారు. ఎస్. వాసవ్య టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు ఎంపికయింది. వీరు నలుగురు

నర్సీపట్నం ప్రాంతంవారు కావడం ఒకే కళాశాలలో చదువుతూ ప్రతిభను కనపరచడం సంతోషంగా ఉందని వీరు మరిన్ని విజయాలు సాధించి నర్సీపట్నానికి పేరు తేవాలని మంత్రి

ఆకాంక్షించారు.
నర్సీపట్నం ఎంపీపీ రమణమ్మ , నాతవరం ఎంపీపీ సన్యాసి దేవుడు, పాండవ నీటి కమిటీ అధ్యక్షులు కొండ బాబు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు

అడిగర్ల అప్పలనాయుడు, కైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ విద్యార్థులను అభినందించారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam