DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాతృ మరణాలు జరిగితే కఠిన చర్యలు : కలెక్టర్ నివాస్

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 06 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఒక్క మాతృ మరణం కూడా సంభవించరాదని, ఇకపై అలా జరిగితే

బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్య

ఆరోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైద్య శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా

జిల్లాలో ఒక్క మాతృ మరణం కూడా సంభవించరాదని, అలా సంభవిస్తే బాధ్యులపై  à°•à±à°°à°¿à°®à°¿à°¨à°²à± చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. à°ˆ ఏడాదిలో 31 మంది మరణాలు సంభవించాయని, అందులో

సరైన సమయంలో వైద్యం, రక్తం అందక కొందరు, తీవ్ర రక్తస్రావం జరిగి దారిమధ్యలోనే కొందరు వెరశి 6గురు మరణించారని అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు

కలెక్టర్ చెప్పారు. అంతేకాకుండా అనవసరంగా కె.జి.హెచ్, ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని, అనవసరంగా రిఫర్ చేసినా బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టుటకు

వెనుకాడేదిలేదని కలెక్టర్ స్పష్టం చేసారు. ఆసుపత్రిలో గర్భిణీ, ఇతర రోగులు వైద్యానికి చేరిన వెంటనే వారి పరిస్థితి పూర్తి స్థాయిలో పరిశీలించి కేసు

పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరంగా ముందుగా తెలియజేయాలని అన్నారు. జిల్లాలో పి.హెచ్.సి, సి.హెచ్.సి మరియు రిమ్స్ ఉంటుండంగా  à°ªà±à°°à°¸à°µà°¾à°²à°•à± కెజిహెచ్ కు రిఫర్

చేయాల్సిన అవసరం ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. గర్భిణీ స్త్రీలు విశాఖపట్నం వరకు ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తెలుసుకోవాలని

పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రయాణ సమయంలో రక్త స్రావం జరిగి, మరణాలు సంభవిస్తే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. వైద్య సిబ్బంది మానవత్వం కలిగి ఉండాలని

పేర్కొన్నారు. ఇకపై ప్రతీ కేసు  à°¸à°‚బంధిత పి.హెచ్.సి, సి.హెచ్.సిల పరిధిలోనే వైద్యాన్ని అందించాలని, ఒకవేళ అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేనిఎడల రిమ్స్ కు తరలించాలని,

అంతేగాని కె.జి.హెచ్ కు తరలించరాదని కలెక్టర్ స్పష్టం చేసారు. ఇటీవల సీతంపేటలో కేవలం రక్త స్రావం కారణంగా మాతృ మరణం సంభవించడం తనను తీవ్రంగా బాధించిందని, ఇది

సరికాదని అన్నారు. ఇప్పటికీ ఇటువంటి మరణాలు సంభవించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గర్భిణీలకు రక్తం తక్కువగా ఉంటుందని, కావున ప్రతీ ఆసుపత్రిలో బ్లడ్

యూనిట్లు లభ్యంగా ఉంచేందుకు సంబంధిత సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్య సదుపాయాల లేమి కారణాలతో కె.జి.హెచ్ కు తరలించబడుతున్న వారందరూ ఇకపై రిమ్స్

లోనే వైద్యాన్ని పొందేందుకు అవసరమైన వైద్య సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± ఆసుపత్రుల్లో మరణాలు సంభవిస్తే సహించేదిలేదని, అటువంటి

ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులను జారీచేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఎక్కువ మాతృ మరణాల్లో మన జిల్లా ఉందని , దాన్ని తగ్గించేందుకు వైద్య

సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ సూచించారు.
  à°ˆ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి à°¡à°¾ à°Žà°‚.చెంచయ్య,  à°œà°¿à°²à±à°²à°¾ ఆసుపత్రుల సమన్వయ అధికారి à°¡à°¾.

బి.సూర్యారావు, వైద్య అధికారులు డా. బి. జగన్నాథరావు, డా. నరేష్ కుమార్, డా. వై.వి. కామేశ్వరప్రసాద్, డా.ఆర్.అరవింద్, వైద్యులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam