DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జివిఎంసి కమిషనర్ విద్యార్థిగా మారిన వేళ . . .     

విద్యార్దులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి

ఉత్తమ విద్య, క్రమశిక్షణతో విద్యార్దులను తీర్చిదిద్దండి

ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ విధానం అమలు

 

వివిధ తరగతుల సందర్శన బోధన, పరిశీలన

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ) . . . .

విశాఖపట్నం, ఆగస్టు  06, 2019 (డిఎన్‌ఎస్‌) : ఐఏఎస్ అధికారి, గ్రేటర్ విశాఖపట్నం నగర పాలనా

కార్పొరేషన్ ( జివిఎంసి) కమిషనర్ డాక్టర్ జి. సృజన పాఠశాల విద్యార్థిగా మారి అందరినీ విస్మయ పరిచారు. మంగళవారం ఉదయం నగరం లోని  à°¯à°‚.జి.యం ఉన్నత పాఠశాలను ఆమె

సందర్శించారు. ఈ సందర్బంగా తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఒక విద్యార్థిగా తరగతి బెంచి పై కూర్చుని

ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్దగా విన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్దులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, తరగతి గదులు,

పాఠశాల  à°ªà°°à°¿à°¸à°°à°¾à°²à±  à°ªà°°à°¿à°¶à±à°­à±à°°à°‚à°—à°¾ ఉంచాల ని ప్రధానోపాధ్యాయు యం.వి. లక్ష్మిని ఆదేశించారు.  
ఉత్తమ విద్యను అందించడం ద్వారా విద్యార్దుల లో క్రమశిక్షణ

పెంపొందించాలని అభిషించారు.  à°°à°¿à°µà°¿à°œà°¨à±‌ తరగతులను ప్రత్యేక తరగతులుగా నిర్వహించాలని సూచించారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¦à±à°²à± యూనిఫారం, బూట్లు ధరించేలా చొరవ చూపాలని

పేర్కోన్నారు. అన్ని తరగతి గదుల్లో బెంచీలు ఉండేలా చూడాలని, ఏ ఒక్క విద్యార్ది నెలపై కూర్చోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు అవసరమైన, ఉత్తమమైన

బోధనా పద్ధతులు పాటించేలా చూడాలని పేర్కోన్నారు.  à°…దేవిధంగా ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని సూచించారు.  
    à°¡à°¿à°œà°¿à°Ÿà°²à±‌ తరగతులను పరిశీలించి

సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యస్‌.యస్‌.సి లో (పదవతరగతిలో) ఉత్తమ ర్యాంకు సాధించేలా విద్యార్దులకు తర్ఫీదునివ్వాలని ఆదేశించారు. తదుపరి

ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై  à°ªà°²à± సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam