DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిజిటిలూ విద్యార్ధుల మన్ననలు పొందండి : శ్రీకాకుళం జే సీ

శ్రీకాకుళం జే సీ రజనీకాంతారావు సూచన 

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 06 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚

జిల్లాలోని కె.జి.బి.విలలో నూతనంగా నియమించబడిన పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ ( పి.జి.టి ) విద్యార్ధుల మన్ననలను పొందాలని సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు

పేర్కొన్నారు. యస్.యస్.ఏ ద్వారా  à°•à±†.జి.బి.విలలో నూతనంగా నియమించబడిన  à°ªà°¾à°°à±à°Ÿà± టైమ్ పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం మంగళవారం

కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పి.జి.టిలకు నియామక పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు  à°°à±‹à°¸à±à°Ÿà°°à± విధానం ప్రకారం పి.జి.టిలను పారదర్శకంగా నియమించడం జరిగిందని అన్నారు. ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదని స్పష్టం

చేసారు.  à°•à±Šà°¤à±à°¤à°—à°¾ నియమితులైన పి.జి.టిలను ముందుగా అభినందించిన ఆయన విద్యార్ధుల మన్ననలను పొందేలా పి.జి.టిలు పనిచేయాలని సూచించారు. ప్రతీ రోజూ తరగతులు ఉంటాయని,

నియామకం జరిగిన ప్రదేశాల్లోనే ఉపాధ్యాయులు ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా వారికి నియమించిన సబ్జెక్టులలో విద్యార్ధులకు మంచిగా బోధించాలని

తెలిపారు. గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులదని, దానిపై మరింత శ్రద్ధ వహిస్తే ఇదేమి అసాధ్యంకాదని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వ శిక్ష అభియాన్

ప్రోజెక్ట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 80 మందికి పార్ట్ టైమ్ పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ నియామక పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. నూతనంగా

నియమితులైన పి.జి.టిలు అందరూ బోధనపై శ్రద్ధ వహించి విద్యార్ధుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.జి.టిలు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam