DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం 

పర్యవేక్షణలో మంత్రి ధర్మాన, కలెక్టర్ నివాస్

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 07 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°µà°‚శధార,

నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లోని ముంపుకు గురైన గ్రామ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం

వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాలను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పాలకొండ మరియు పాతపట్నం శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, రెడ్డి

శాంతిలతో కలిసి స్వయంగా పరిశీలించారు. భామిని మండలం సింగిడి, కోసలి, కేసరి, హిరమండలం మండలంలోని గొట్టా ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలిసిన

మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కురిసిన భారీవర్షాల కారణంగా నాగావళి, వంశధార నదుల్లో వరద ఉధృతి పెరిగిందని అన్నారు. ఇప్పటికే

వంశధార నదికి 82 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేయడం జరిగిందని,  à°¨à°¾à°—ావళి నదికి సంబంధించి తోటపల్లి బ్యారేజ్ నుండి 55 వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లో జరుగుతుందని

అన్నారు. దీనివలన వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసారు.  à°µà°‚శధార నది ఉధృతికి కారణమైన  à°’డిషాలోని రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వారి నుండి

ప్రతీక్షణం వివరాలను సేకరించడం  à°œà°°à±à°—ుతుందని చెప్పారు. మనకు ప్రక్కన ఉన్న కాశీనగర్, గుణుపూర్, కాట్రగడ్డ రిజర్వాయర్ల నుండి విడుదల కాబోయే నీటి వివరాలను

ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్.à°Ÿà°¿.జి.యస్ అంచనాల మేరకు ఒడిషాలో గురువారం కూడా భారీవర్షాలు కురిసే  à°…వకాశముందని, తద్వారా మనకు 1.3లక్షల

క్యూసెక్కుల వరద నీరు రావడానికి అవకాశం ఉందన్నారు.  à°¨à±€à°Ÿà°¿ విడుదలకు అణుగుణంగా నదీపరీవాహక ముంపు ప్రాంతాలకు ఇప్పటికే ముందస్తు సమాచారం అందించి హెచ్చరికలు

జారీచేయడం జరిగిందన్నారు. ముంపు గ్రామాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని, మిగిలిన ముంపు ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాలను

ఏర్పాటుచేసేందుకు ఉత్తర్వులు జారీచేసామన్నారు. ఇందుకోసం రెవిన్యూ సిబ్బందిని ఏర్పాటుచేయడం జరిగిందని, అలాగే పునరావాస కేంద్రాల్లోని పిల్లలకు ఐసిడిఎస్

ద్వారా పాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాకు రెండు యన్.à°¡à°¿.ఆర్.ఎఫ్ బృందాలు వస్తున్నాయని,  à°’à°• యస్.à°¡à°¿.ఆర్.ఎఫ్ బృందం ఇప్పటికే రావడం

జరిగిందని అన్నారు. వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడలో వేటకోసం వెళ్లిన మత్స్యకారులు నదిలో

చిక్కుకున్నారని తెలిసిందని, వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంతకుమించి జిల్లాలో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదని,

పరిస్థితిలన్నీ అనుకూలంగానే ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేసారు. నదీపరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే వి.ఆర్.ఓలు, వి.ఆర్.ఎలు , రెవిన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో

పనిచేస్తున్నారని, ముంపు ప్రాంతాలవారికి ముందుగానే సమాచారాన్ని అందిస్తూ 24 గంటలు పరిస్థితులను గమనించడం జరుగుతుందని కలెక్టర్  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±. తొలుత గొట్టా

బ్యారేజ్ ను సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితిలను పర్యవేక్షక ఇంజినీరును అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు.
          à°ˆ కార్యక్రమంలో సమగ్ర

గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సి.ఎం.సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, వంశధార పర్యవేక్షక ఇంజినీర్ రంగారావు , ఇతర అధికారులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam