DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో గ్రామీణ క్రీడ అభివృద్ధికి పెద్దపీట : క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

నర్సీపట్నం మే 19, 2018 (DNS Online): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి వివిధ పథకాలను ప్రవేశ పెట్టినట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లి రవీంద్ర

పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గనుల శాఖామంత్రి సుజయ కృష్ణ రంగారావు లతో కలిసి నర్సీపట్నంలో పలు

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పోలీసు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం

కలిగిన యువత ఎంతో మంది ఉన్నారని వారికి శిక్షణ ఇచ్చినట్లయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారు అన్నారు.అంతర్జాతీయస్థాయిలో పి.వి.సింధు బంగారు పథకం

సాధించిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని ఉదహరించారు. నర్సీపట్నం వంటి గ్రామీణ ప్రాంతంలో ఇండోర్ స్టేడియం కు శంకుస్థాపన చేయడం

ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన స్కేటర్ లను పట్నం పిలిచి స్కేటింగ్ రింక్ ప్రారంభించడం అయ్యన్న పాత్రుడు కృషికి నిదర్శనమన్నారు.
గనుల

శాఖామంత్రి సుజయ కృష్ణ రంగారావు మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంత అభివృద్ధికి అయ్యన్నపాత్రుడు చేస్తున్న కృషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద ప్రజల సొంత

ఇంటి కల సాకారానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 2150 ఒక్క మందికి మంజూరు పత్రాలు ఇవ్వడం ఆయనకే చెల్లిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను అందరు

వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి చంద్రబాబునాయుడు

చేస్తున్న కృషిని గూర్చి వివరించారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ఏ మాత్రం ఆటంకం లేకుండా నిర్వహించే ప్రయత్నం

చేస్తున్నామన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam