DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుచానూరు ఆలయం లో అద్భుతంగా వరలక్ష్మీవ్రతం

భక్తులతో కిటకిటలాడిన పద్మావతి అమ్మవారి ఆలయం   

స్వర్ణరథోత్పవం పై ఊరేగిన అమ్మవారు  :

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . .

తిరుపతి, ఆగస్టు  09, 2019 (డిఎన్‌ఎస్‌):

శ్రావణ శుక్రవారం పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం వైభవంగా జరిగింది. ఈ పర్వదినోత్సవం

 à°¸à°‚దర్భంగా అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని

ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఆలయ

ప్రాంగణాన్ని అంతా వివిధ రకాల పుష్పలతో అలంకరించి అమ్మవారిని ఆరాధించారు. 

వేంకటాచల మహత్యం స్కాంద పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీ వ్రతం

మహత్యాన్ని ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని

తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. తదుపరి 12 రకాల నైవేధ్యాలను అమ్మవారికి నివేదించారు. 

ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్

మాట్లాడుతూ సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరులో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా

వస్తుందన్నారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు.

వరలక్ష్మీ

వ్రతం సందర్భంగా ఆలయం à°µ‌ద్ద ఉన్న ఆస్థాన మండపంలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. à°­‌క్తుల సౌక‌ర్యార్థం

ఆస్థాన మండ‌పంలో 4, à°Šà°‚à°œ‌ల్ మండ‌పంలో 1, తోళ‌ప్ప‌గార్డెన్‌లో 1 à°•‌లిపి మొత్తం 6 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ హిందూ à°§‌ర్మ ప్ర‌చార à°ª‌à°°à°¿à°·‌త్

ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా తిరుచానూరుకు విచ్చేసే వేలది మంది భక్తులకు అన్నప్రసాదాలు

అందిస్తున్నామన్నారు. à°ˆ సంద‌ర్భంగా దాదాపు 50 వేల భక్తులకు కంకణాలు, పసుపు ధారాలు, పసుపు, కుంకుమ, 2 à°²‌క్ష‌à°² గాజులు పంపీణి చేస్తున్నట్లు వివ‌రించారు. à°ˆ పర్వదినాన

అమ్మవారికి బంగారుచీరతో విశేష అలంకరణ చేసినట్లు వివరించారు.

స్వర్ణరథోత్పవం పై ఊరేగిన అమ్మవారు  : 

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు

అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ,

కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసింది.

à°ˆ కార్యక్రమంలో తిరుప‌తి జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్ దంప‌తులు, సివిఎస్వో  à°—ోపినాథ్ జెట్టి దంప‌తులు, à°…à°¦‌à°¨‌పు

సివిఎస్వో  à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à±‌రెడ్డి, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి  à°à°¾à°¨à±à°¸à±€à°°à°¾à°£à°¿, విజివో  à°†à°¶à±‹à°•à±‌కుమార్‌ గౌడ్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam