DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రీడాకారుల గుర్తించేందుకు ట్యాలెంట్ హంట్ 

నెలకో  à°’à°• జిల్లాలో క్రీడా పోటీ :

పర్యాటక, యువజన, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS )

అమరావతి, ఆగస్టు  11, 2019

(డిఎన్‌ఎస్‌): రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఏటా సీఎం కప్ నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పర్యాటక, యువజన, క్రీడా శాఖ మంత్రి

ముత్తంశెట్టి  శ్రీనివాస్ తెలిపారు. ట్యాలెంట్ హంట్ పేరుతో 12నెలలల్లో  à°¨à±†à°²à°•à± à°’à°• జిల్లాలో క్రీడా పోటీ లు నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసి 13à°µ

నెలలో రాజధాని అమరావతి లో సీఎం కప్పు పేరిట పోటీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు అనుగుణంగా త్వరలో స్పోర్ట్స్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని మంత్రి

చెప్పారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ లో మూడు రోజుల పాటు ఏపీ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథిలిటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీ లు జరిగాయి. ఆదివారం

మధ్యాహ్నం జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కు పర్యాటక... యువజన..క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 14,16, 18, 20 ఏజ్ గ్రూప్ లు వారీగా క్రీడా కారులు

13 జిల్లాల నుంచి సుమారు  à°ªà°¨à±à°¨à±†à°‚డు వందల మంది పోటీపడ్డారు. ఓవరాల్ ఛాంపియన్ à°—à°¾ విశాఖ జిల్లా నిలిచింది.బాలికల్లో మొదటి స్థానాన్ని కృష్ణా జిల్లా దక్కించుకోగా

శ్రీకాకుళం జిల్లా బాలురలో మొదటి స్థానంలో నిలిచారు. విజేతలకు మంత్రి అవంతి శ్రీనివాస్ ట్రోపి లు ప్రదానం చేశారు. వ్యక్తిగత విభాగాల్లో గెలుపొందిన వారికి

మంత్రి మెడల్స్ అందచేశారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుత బడ్జెట్ లో స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు 140 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. ప్రజలు తమ దైనందన జీవితంలో ఎక్సర్ సైజ్ ను దినచర్య లో

భాగంగా చేసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి క్రికెటర్ అని చెబుతూ హైదరాబాద్ లోని హెచ్ పీఎస్ లో చదివే రోజుల్లో సీఎం కెప్టెన్ గా

 à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚చినట్లు తెలిపారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి à°Žà°‚à°¤ బిజీగా ఉన్నా రోజూ ఎక్సర్ సైజ్ చేయకుండా తన కార్యకలాపాలను ప్రారంభించారని మంత్రి అవంతి శ్రీనివాస్

చెప్పారు.

మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలను కని వాటిని నెరవేర్చుకునెందుకు సృజనాత్మకంగా ఆలోచించి ప్రణాళికబద్ధంగా

ముందుకు వెళ్ళితే విజయం తప్పక వరిస్తుందని ఆయన వివరించారు. విద్యార్థులు లక్ష్యం పట్ల ఆశతో ఉండాలని దురాశతో ఉండరాదని మంత్రి అన్నారు. ఆశ లేకుంటే మనిషి మనుగడే

ఉండదన్నారు.పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకత తీసుకువస్తున్నట్లే క్రీడల్లో ను తీసుకువస్తామని చెప్పారు. ప్రతిభే గీటు రాయిగా క్రీడా కారుల ఎంపిక

జరుపుతామని కుల,మత, ప్రాంత బేధాలు వంటి పక్షపాత ధోరణిని పూర్తిగా రూపుమాపడానికి కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో

నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పాల్ కుమార్, టెన్విక్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ప్రతినిధి వసంత్ భరద్వాజ్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్

ప్రతినిధి ఆదిరెడ్డి సత్యనారాయణ, కెడీఏఏ చైర్మన్ రమేష్ జైన్, ఏఎఫ్ ఐ సభ్యులు ఏవి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam