DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ పరిపాలన - ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజలకు

అంధ్రప్రదేశ్ శాసన సభ సభాపతి తమ్మినేని సీతారాం

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 11 , 2019 (డిఎన్‌ఎస్‌):

ప్రభుత్వ ఫలాలు నేరుగా సామాన్యప్రజలకు అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన రేడ్డి గ్రామ పరిపాలన వ్యవస్ధను ఏర్పాటు చేసినట్టు అంధ్రప్రదేశ్ శాసన సభ సభాపతి

తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అందులో భాగంగానే గ్రామ వాలంటీర్లనియామకం జరిగిందని తెలిపారు. ఆమదాలవలస మండలం గ్రామ వాలంటీర్ల శిక్షణ పూర్తయిన వారితో

ఆదివారం సాయంత్రం మార్కెట్ యార్డు ప్రాంగణంలో ముఖా ముఖీ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ

సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తాను నిర్వహించిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. వాటన్నిటినీ పరిష్కరించడానికి

ముఖ్యమంత్రి తొలి అడుగు వేసినట్టు చెప్పారు. గ్రామ వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ప్రభుత్వ పధకాలు అందినదీ లేనిది పరిశీలంచి గ్రామ సచివాలయానికి తెలియస్తారని

చెప్పారు. గ్రామ స్థాయి నుండి అన్ని రికార్డులు తయారవుతాయని చెప్పారు. మహిళలకు కుడా అన్ని రంగాల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టాని తీసుకు వస్తున్నట్టు

తెలిపారు. ఇక మహిళలే దేశాన్ని పరిపాలిస్తారని అన్నారు. ఈ ప్రభుత్వం సామాజిక ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మంత్రి వర్గంలో అధికారం కట్టబెట్టినట్టు తెలిపారు.

గ్రామ వాలంటీర్లు కూడా రిజర్వేషన్ ప్రాతిపధికన ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. మీలో ఆత్మధ్దైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించాలని చెప్పారు. అందు కొరకు గౌరవ

వేతనాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. తదుపరి దీనిని కన్సాలిడేటెడ్ పేగా మారుస్తారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులుగా మారి ప్రభుత్వ పాలనసైతం మీచేతిలో ఉంటుందని

చెప్పారు. భారతదేశంలో ఇది ఒక అద్భుతమైన శక్తిగా మారుతుందన్నారు. ఈది రాజకీయం కాదు ఇది ఒక లక్ష్యం, ప్రజాసమస్యలు పరిష్కార వేధిక అన్నారు. మానవతా వాధికి అండగా

పనిచేయాలని చెప్పారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా సరఫరా చేసిన కంది విత్తనాలను రైతులకు అందజేశారు.
        వై ఎస్ ఆర్ సి.పి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

తమ్మినేని చిరంజీవి నాగ్ మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్దంగా గత ప్రభుత్వం జన్మభూమి పేరుతో పేద వారి హక్కులను కాలరాసారని అన్నారు. గ్రామ స్థాయిలో 72 గంటల్లో

సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామ వాలంటీర్లపై నైతిక బాధ్యత ఉందని అన్నారు.
   à°ˆ కార్యక్రమంలో

కోపరేటివ్ ప్రెసిడెంట్ బెండి గోవిందరావు, మండల వై.ఎస్.ఆర్.పి.సి పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, గురుగు బెల్లి శ్రీనివాసరావు, మండల ప్రత్యేక

అధికారి రవి ప్రకాష్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam