DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్యాగధనుల త్యాగాలను విస్మరించరాదు : మంత్రి ధర్మాన

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఆగస్టు 15, 2019 (డిఎన్‌ఎస్‌): 

మనం స్చేచ్ఛా జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగఫలాలు దాగి ఉన్నాయి. వారందరికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్టు రాష్ట్ర రహదారులు, భవనాల

శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గురువారం జరిగిన స్వతంత్య్ర  à°µà±‡à°¡à±à°•à°²à±à°²à±‹ అయన మాట్లాడుతూ  à°¸à±à°µà°¾à°¤à°‚త్య్ర  à°¸à°®à°°à°¯à±‹à°§à±à°² ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ

అంకితభావంతో పనిచేయాలి. వారు కలలుగన్న భారతావనిని సాకారం కావాలి. స్వాతంత్ర్యం సాధించి 73వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం అన్నారు.
    à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం

రాష్ట్రాన్ని సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకొనివెళ్ళుటకు కృషి చేస్తుంది. “నవ రత్నాలను” సమర్థవంతంగా అమలుచేసి ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతిరహితమైన

పరిపాలనను అందించుటే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నా అన్నారు.  à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ వైపరీత్యాలను సమయంలోనూ సమర్ధంగా పనిచేసి ప్రాణ, ఆస్థి నష్టాలను గణనీయంగా

తగ్గించుటకు అతి జాగరూకతతో పరిస్ధితులను గమనిస్తున్న సంగతి విదితమే. జిల్లాలో ఈ నెల 7,8 తేదీల్లో వంశధార, నాగావళి నదుల వరదలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం

చేసి ఎటువంటి నష్టం లేకుండా పనిచేయడం జరిగింది. ఇందుకు జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. 
 à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం ప్రజల సమస్యలను

పరిష్కరించడమే ప్రధాన అజెండాగా పనిచేస్తుందని తెలియజేస్తున్నా అన్నారు. “స్పందన” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజల సమస్యలను త్వరితగతిన

పరిష్కరించుటకు చర్యలు చేపడుతున్నాం. వారం రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని నిర్ణయించాము. జిల్లాలో “ స్పందన ” కార్యక్రమంను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం

మీకు తెలిసిందే. à°ˆ కార్యక్రమంలో ఇంత వరకు 13,201 ఆర్జీలు అందగా, 11,062 ఆర్జీలను పరిష్కరించామన్నారు.. 

వాలంటీర్లు, గ్రామ/ వార్డు సచివాలయాలు 
రాష్ట్ర ప్రభుత్వం

చక్కని పరిపాలనను అందించుటకు యోచిస్తున్నది. సుపరిపాలన ద్వారా పౌరులకు మంచి సేవలు అందించడం ధ్యేయంగా గ్రామ/ వార్డు వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసింది. ప్రతి 50

కుటుంబాలకు ఒక వాలంటీరు చొప్పున జిల్లాలో 13,427 మంది గ్రామ వాలంటీర్లను, పట్టణ ప్రాంతాల్లో 1902 మంది వార్డు వాలంటీర్లను నియమించడం జరిగింది. ప్రభుత్వం అందించే ప్రతి

అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను ప్రజలకు చేరవేయుటలో వాలంటీర్లు ప్రముఖ పాత్ర పోషించాలని కోరుచున్నాను. గ్రామ పరిపాలనా వ్యవస్ధకు నూతన జవసత్వాలు అందించుటకు

పరిపాలనను ప్రక్షాళన చేయుటకు గ్రామ సచివాలయ వ్యవస్ధ ఏర్పాటు చేయడం జరుగుచున్నది. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం జరిగింది. జిల్లాలో 835 గ్రామ

సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 94 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరుగుచున్నది. 11 రకాల సేవలకను అందించుటకుగాను 1141 గ్రామ పంచాయతీల్లో 7,326 మందిని నియమించుటకు

నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్, ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాల ప్రతినిధులు

పాల్గొన్నారు. వివిధ  à°°à°‚గాల్లో సేవలు అందించిన వారికీ అవార్డులు అందించారు. ఇదే ప్రాంగణం లో ఏర్పాటు చేసిన స్టాల్ల ను పర్యవేక్షయించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam