DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇది నది కాదు బెజవాడ నగర వీధులే : నేత మునిగిన వీధులు

ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలి : మంత్రి వెల్లంపల్లి .

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . 

అమరావతి,  à°†à°—స్టు  17, 2019 (డిఎన్‌ఎస్‌) :

ప్రకాశం బ్యారేజి వరద ప్రవాహ ప్రభావంతో విజయవాడ నగర వీధులు నీట మునిగిపోయాయి. వరద నీటి తో మునిగిపోయిన నగర వీధులు చిన్న పాటి నదిని తలపిస్తున్నాయి. శనివారం ఈ

ప్రాంతాల్లో పర్యటించిన దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లవలసిందిగా సూచించారు. మోకాళ్ళ లోతులో నీట

మునిగిన వీధుల్లో పర్యటించి, నీట మునిగిన ప్రజలను బలవంతంగానైనా తరలించాలని అధికారులకు ఆదేశాలు జరీ చేసారు.    à°²à±‹à°¤à°Ÿà±à°Ÿà± ప్రాంతమైన భవానిపురం, పున్నమి ఘాట్, హరిజన

వాడ, కనక దుర్గ వారది, కృష్ణలంక కరకట్ట ప్రాంతం మరియు కోదండ రామ్ ఘాట్, తారక రామ నగర్ నుంచి రూపేష్ గుప్తా నగర్, పోలీస్ కాలనీ 10 ఎం జి డి వాటర్ ప్లాంట్ రోడ్,

రామలింగేశ్వర నగర్, మసీదు రోడ్ తదితర ప్రాంతాలను పర్యటించారు.

à°ˆ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తం à°—à°¾

ఉండాలని వరద ఉదృతి తగ్గే వరకూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలి వెళ్ళాలని కోరారు. 

 à°¬à°¾à°§à°¿à°¤à±à°²à°•à± అవసరమైన ట్రాన్స్ పోర్ట్ తో పాటు

ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం తో పాటు తాగునీరు అవసర మైన మందులను అధికారులు ఎర్పాటు చేశారన్నారు. 

పర్యటనలో మంత్రి వెంట అధికారులు, మాజీ కార్పొరేటర్లు

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam