DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో ఉత్తమ ఫలితాలతో ఆంధ్రాబ్యాంక్ టాప్ 

ఖాతాదారులకు అందుబాటులో కేంద్ర, రాష్ట్ర పధకాలు :  

డిపాజిట్లు, ఋణాల్లో ముందంజ లో నిలిచాం   

-ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ పి.కృష్ణయ్య

-

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 17, 2019 (డిఎన్‌ఎస్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పధకాలు

ప్రజలకు చేరవేయడంలో ఆంధ్ర బ్యాంకు అత్యంత విస్తృతంగా పని చేస్తూ. . శ్రీకాకుళం జిల్లాలో అగ్రగామిగా నిలిచిందని  à°†à°‚ధ్రాబ్యాంకు పనిచేస్తుందని à°† బ్యాంకు జోనల్

మేనేజర్ పి.కృష్ణయ్య పేర్కొన్నారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ ఉదయం ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఆంధ్రాబ్యాంకు శ్రీకాకుళం జోన్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొత్తం  81 బ్రాంచిలు పనిచేస్తున్నాయని తెలిపారు. à°ˆ బ్రాంచ్ లన్నీ జాతీయ ప్రాధాన్యతలతో

పనిచేస్తున్నాయని అన్నారు. ఆంధ్రాబ్యాంకు ఆర్ధిక అభివృద్ధి కొరకు రుణ సదుపాయాన్ని ఏర్పాటుచేస్తుందని, అలాగే మౌళిక సదుపాయాల నిర్మాణంతో పాటు పరిశ్రమల స్థాపనకు

రుణాలను మంజూరుచేస్తున్నట్లు పేర్కొన్నారు.    à°µà±à°¯à°µà°¸à°¾à°¯ రంగంతో పాటు నీలి ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన లావాదేవీలను జరుపుతున్నామని చెప్పారు. జలశక్తి అభియాన్ ,

సూక్ష్మ, లఘు, మద్య శ్రేణి పరిశ్రమల రంగాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ముద్ర రుణాలను సైతం మంజూరుచేస్తున్న సంగతిని ఆయన గుర్తుచేసారు. ఇవేకాకుండా విద్యారుణాలు,

ఎగుమతి రుణాలు, హరిత ఆర్ధిక వ్యవస్థలకు చేయూతనిస్తున్నట్లు వివరించారు. ప్రతీ ఆంధ్రాబ్యాంకులో ప్రత్యక్ష ప్రయోజన బదిలీతో పాటు నగదురహిత లావాదేవీలను

నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సులభతర జీవన విధానం, స్థానిక ప్రాధాన్యతలతో సంకరణం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలను కూడా చేపడుతున్నట్లు జోనల్ మేనేజర్

పేర్కొన్నారు. సామాజిక పింఛన్ల నగదు పంపిణీలో ఇతర బ్యాంకుల మాదిరిగా ఎన్నడూ సమస్యలు తలెత్తలేదని,  à°ªà°¿à°‚ఛన్ల పంపిణీకి సరిపడే నగదును ఆంధ్రా బ్యాంక్ ఎల్లపుడూ

సిద్ధంగా ఉంచుతుందని తెలిపారు. ఆధార్ నమోదు కేంద్రాలను కూడా ఆంధ్రా బ్యాంకులలో ఏర్పాటు చేసామని,ఆధార్ నమోదులలో ఆంధ్రాబ్యాంకుద ప్రధమస్థానమని చెప్పారు. ఈ

బ్యాంకు ఆధ్వర్యంలో శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ, రాజాం బ్రాంచ్ లలో ఆధార్ నమోదు కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు ఒక్కో

బ్రాంచిలో సుమారు 85 మంది వరకు ఆధార్ మార్పులు, చేర్పులు కావడం విశేషమని చెప్పారు. మొదటిసారి ఆధార్ నమోదు చేసుకునే వారు ఎటువంటి రుసుమును చెల్లించవలసిన అవసరం లేదని,

ఆధార్ లో చేర్పులు మార్పులకు  à°¨à°¾à°®à°®à°¾à°¤à±à°° రుసుము క్రింద రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. à°ˆ బ్యాంకు  à°®à°°à°¿à°¨à±à°¨à°¿ సేవలు అందించేందుకు కృషిచేస్తుందని ఆయన à°ˆ సందర్భంగా

వివరించారు.

ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు ఏ.జి.యం కె.వెంకట్ రాజు, చీఫ్ మేనేజర్ సింహాచలం, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీహరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam