DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్తి వరదుడు కోనేటి రాయుడు మళ్ళీ కోనేటి నిక్షిప్తం 

ఉద్వేగానికి గురైన అర్చకులు, భక్తులు 

వారసుని దర్శనం మళ్ళీ  40 ఏళ్ళ తర్వాతే 

భక్తులకు అనుమతి నో, పోలీసు బందోబస్త్ లో . . 

48 రోజులు . .2 కోట్ల మంది పేద . .

రాజు అంతా . . .

అద్భుతం  . . .అమోఘం . . . జీయర్ల మంగళాశాసనం. . . . 

హస్తి వరదుడు. . అత్తివరదర్‌ à°—à°¾ మారారు .: చిన్న జీయర్ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau ) . . . .

కాంచీపురం /

విశాఖపట్నం, ఆగస్టు  18, 2019 (డిఎన్‌ఎస్‌) : సుమారు 48 రోజుల పాటు కోట్లాది మంది ని అనుగ్రహించిన కాంచీపురం అత్తివరదరాజస్వామి తిరిగి కోనేటి ప్రవేశం చేసారు. à°—à°¤ చరిత్ర

అనుసరించి భక్త జనాన్ని అనుగ్రహించిన స్వామిని యధా శక్తి ఆలయంలోని కోనేటి లో తిరిగి నిక్షిప్తం చేసారు.  

మళ్లీ 40 ఏళ్ల తర్వాతే ఆయన భక్తులకు దర్శమిస్తారు.

దాదాపు  2  à°•à±‹à°Ÿà±à°²à°®à°‚ది అత్తివరదర్‌ పెరుమాళ్‌ని దర్శించుకున్నారని అంచనా. కాంచీపురం అత్తి వరదరాజస్వామి మళ్లీ కోనేటి ప్రవేశం చేశారు. 48రోజుల పాటు భక్తులకు

దర్శనమిచ్చి... కోనేటి గర్భంలోకి వెళ్లిపోయారు. 

మళ్లీ 40ఏళ్లకు బయటకు వస్తారు. 

జులై 1 నుంచి ఆగస్టు 17 వరకూ దర్శనం లభించిన ఈ 48 రోజుల్లో తొలి 38 రోజులు

శయనస్థితిలోనూ, మిగిలిన 10 రోజులు నిలబడినట్లు భక్తులకు దర్శనమిచ్చారు అత్తివరదర్ పెరుమాళ్‌.  à°¸à±à°µà°¾à°®à°¿à°¨à°¿ కోనేటి నిక్షిప్తం చేసే సమయంలో అర్చక స్వాములు, భక్తులు

ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు. 

వరదరాజస్వామి విగ్రహాం అత్తిచెక్కతో నిర్మితమైంది. 9 అడుగుల పొడవు ఉండే ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఆదేశంతో

దేవశిల్పి విశ్వకర్మ రూపొందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన ముస్లిం ల దండయాత్రలో కంచి దేవాలయం దోపిడీకి గురైందని, ఆ సమయంలో

విగ్రహాన్ని కాపాడేందుకు వెండి పెట్టెలో పెట్టి ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన అడుగుభాగంలో భద్రపరిచారని పెద్దలు చెబుతారు.

జీయర్ల  à°®à°‚గళాశాసనం . .  .

.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో దివ్య విదేశాల్లో వేంచేసిన పెరుమాళ్ళను ఆళ్వార్లు, జీయర్లు, యతీశ్వరులు మంగళశానములు చేయడం సంప్రదాయం à°—à°¾ వస్తోంది. అత్తివరదర్‌

పెరుమాళ్‌ని దర్శించుకున్న ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వామిని వేనోళ్ళ కొనియాడుతూ మంగళాశాసనం చేసారు. స్వామికి మంగళ శాసనం

చేసిన వారిలో త్రిదండి శ్రీరామచంద్ర జీయర్ స్వామి, త్రిదండి అహోబిల జీయర్ స్వామి తదితరులున్నారు.  

హస్తి వరదుడు. . అత్తివరదర్‌ à°—à°¾ మారారు .: చిన్న

జీయర్ 

వరదరాజ స్వామి ఏనుగులను సైతం ఆపద నుంచి కాపాడి అనుగ్రహించిన వాడు కావడంతో హస్తి వారసునిగా ఖ్యాతి చెందారు. అయితే తమిళ భాషలో హ అక్షరం లేదని, దీనికి

మారుగా " à°† " అలవాటు లోకి వచ్చిందని, " స్తి " అక్షరం  " త్తి " à°—à°¾ మారి అత్తి à°—à°¾ ప్రాచుర్యంలోకి వచ్చిందని చిన్న జీయర్ స్వామి తెలియచేసారు.   
 
రాజు నుంచి పేద వరకూ. .

అందరికీ ఆనందమే 

స్వామిని దర్శించిన వారిలో సామాన్య భక్తుల నుంచీ అసామాన్యుల భక్తుల వరకూ ఎందరో ఉన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్, ముఖ్యమంత్రులు,

తదితర ప్రముఖులు స్వామిని దర్శించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam