DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధునిక సమాజానికి ఆదర్శం పెద్ద జీయర్ స్వామి 

స్వాతంత్ర పోరాటం నుంచి సన్యాసాశ్రమం  à°µà°°à°•à±‚. . .

హరిజన వాడల్లో కాలనీల్లో పర్యటించి స్ఫూర్తి కల్గించి

 à°¦à±‡à°¶ వ్యాప్తంగా ప్రతి క్షేత్రం లోనూ శ్రీరామ

క్రతువులు 

ప్రపంచానికి పరమౌషధం చిన్న జీయర్ వీరి శిష్యులే 

 

(రిపోర్ట్ : విజయకుమారాచార్యులు ముడుంబై, తెలంగాణ )

పెద్ద జీయర్ స్వామి తిరునక్షత్ర

ప్రత్యేకం.  (రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau ). .   

హైద్రాబాద్, ఆగస్టు  18, 2019 (డిఎన్‌ఎస్‌) : à°¶à±à°°à±€ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి వారి తిరునక్షత్రం ఈరోజు  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ మందిని

భక్తులుగా మార్చిన ఘనత వారిది. భారత దేశంలో 108  à°¶à±à°°à±€à°°à°¾à°® క్రతువులని నిర్వహించి శ్రీరామ స్థూపాలను ప్రతిష్ఠించారు. వేద విజ్ఞాన ము అందరికీ అందించారు. యతిరాజ సేవా

మండలీలు ప్రోత్సహించి లక్షలాది మహిళల చేత ఆధ్యాత్మిక కార్యక్రమములు చేయించారు. ఆ గురుదేవుల పాదాలకి అనేక ప్రణామములు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ

జీయర్ స్వామి వారు 1909 సం.లో నిజ శ్రావణంలో ఉత్తరాభాద్ర నక్షత్రాన అవతరించారు. వారు వైకుంఠ ఏకాదశినాడు 1979వ సం.లో ద్వాదశి గడియలు ప్రారంభం అవుతుండగా తిరునాటికి నడిచి

వెళ్ళారు. అంటే భగవంతుని నిత్య సాయిజ్యాన్ని మన కందరికి ప్రసాదించడం కోసం స్వామికి విన్నపించుకోవడానికి ఆలోకానికి వేంచేసారు. వారినే మనం పెద్ద జీయర్ స్వామి

అని వ్యవహరిస్తూ అంటాం. అసలు జీయర్ అంటే ఆయననే, మన వైష్ణవ సంప్రదాయంలో చరమాశ్రమంలో ఉండే వారికి ఆ నామం ఉంటుంది కానీ జీయర్ అనే ఆ మూర్తి ఇట్లా ఉంటుంది, ఇట్లాంటి

కార్యక్రమాలు చేస్తారు కాబోలు అని మన పెద్ద జీయర్ స్వామివారి ప్రచార కార్యక్రమాలు చూసాకే లోకం గుర్తించింది. దక్షిణ భారత దేశంలో ఎందరో జీయర్ స్వాములు ఉంటారు. మన

పెద్ద స్వామి వారి కార్యక్రమాలు చూసాకే వారందరు "ఓహో! అసలు ఇట్లా కూడా చేయవచ్చునా" అని గుర్తించారు. దక్షిణ దేశంలో వానమామలై అనే పీఠం ఉంది, అక్కడ భగవద్రామానుజుల

అపరావతారం అని భావించే మణవాళమామునులు 14వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన పీఠం. లోకంలో సంప్రదాయాన్ని ప్రచారంలో వారిదే ముందడుగు ఉండేది, క్రమేపి అక్కడి వారు కేవలం

మఠాలకే, లేక అక్కడి దేవాలయాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. మన పెద్ద జీయర్ స్వామి వారు కార్యక్రమాలు ఆరంభం చేసాక, అలనాడు రామానుజుల వారు చేసిన కార్యక్రమాలు

పునరుజ్జీవించాయి అని అందరూ అనుకున్నారు. అంతే కాక ఉత్తర దేశంవారు దక్షిణ దేశంవారు ఏకమయ్యారు. ఎన్నో అంతరాలు తొలగిపోయాయి. ఉత్తరదేశంవారూ, దక్షిణ దేశం వారూ

అందరూ మన స్వామి వారిని ఆదరించారు. "వైష్ణవః వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణవేత్ భువి" అని చెబుతుంటారు, అంటే భక్తి కల మహనీయులని భగవంతునితో సమానంగా సేవించాలి అని

నియమం. మనస్పూర్తిగా అట్లా స్వామిని సేవించేవారు. అట్లా స్వామి ప్రచారం అన్ని ప్రాంతాల్లో జరిపారు.

ఒక విషయం తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మొదట స్వామివారు

సన్యాసాశ్రమం తీసుకుందాం అని వానమామలై పీఠంలో సుమారు పద్దెనిమిది రోజులు ఎదురు చూసారు, కానీ భవిష్యత్తులో మఠం యొక్క వారసత్వం కోరుతారేమో అని అక్కడి జీయంగారు

ఒప్పుకోలేదు. నిరాశతో మన స్వామి వారు బయలుదేరి శ్రీవిల్లిపుత్తూర్ గుండా వస్తున్నారు. మొదట శ్రీపెరంబుదూర్ మఠంలో పీఠాదిపతిగా ఉండి, విశ్రాంతికోసం

శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసిఉన్న జీయంగార్లు మన స్వామి నిరాశతో వెనుతిరుగుతున్నారు అని తెలుసుకొని, నేను ఏర్పాటు చేస్తాను అని వారే మన పెద్ద జీయర్ స్వామి

వారికి చరమ ఆశ్రమాన్ని ప్రసాదించారు. మన స్వామి వారు కోరుకున్న వానమామలై పీఠంలోనే దండ కాశాయాల్ని అక్కడి పెరుమాల్ల వద్ద ఉంచి, మన స్వామి వారికి ప్రసాదించారు.

అందుకే మన స్వామి వారి అశ్టోత్తరం à°°à°šà°¿à°‚à°šà°¿à°¨  à°•à°µà°¿à°°à°¤à±à°¨ గుదిమెళ్ళ  à°°à°¾à°®à°¾à°¨à±à°œà°¾à°šà°¾à°°à±à°¯ స్వామి à°’à°• నామాన్ని "తోతాద్రి హరి సాన్నిధ్య లబ్ధ కాశాయ భూషితః" అని రచించారు. ఇలాగ

స్వామి ఆశ్రమాన్ని స్వీకరించి, ఉత్తర దేశంలో బదరికాశ్రమానికి వెళ్ళి పదికోట్ల జపం, కోటి హవనం ఆపై వరుసగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఘనతను సాదించాక ఏ

వానమామలై జీయర్ స్వామివారు మీకు మేం ఆశ్రమం ఇవ్వం అని అన్నారో మన జీయర్ స్వామి ఆప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆయన పండు ముసలిగా ఉండేవారు, మంచంపైనుంచి లేచి మన

స్వామి వారికి నమస్కారంచేసి "కూవికొల్లూం కాలం ఎన్నం కురువాదో" - శ్రీమన్నారాయణా నాకు మోక్షం ఎప్పుడిస్తావయా అని అగిగారు. అంటే వారు మన స్వామివారిని భగవత్

స్వరూపం క్రింద భావించారు అంటే మన స్వామి వారి వైభవం ఎంత గొప్పదో తెలుస్తుంది. అట్లాంటి పెద్ద జీయర్ స్వామి మన స్వామి కావడం మన సుకృతం.

సర్వ మానవ నవ సమాజం

లక్ష్యంగా : . . .

అగ్ర వర్ణ, పేద, ధనిక ఇలాంటితరతమ్యాలు లేకుండా అందరూ భగవానుని ముందు సమానులే అనే ఏకైక లక్ష్యంగా పెద్ద జీయర్ స్వామి హిందూ దేవాలయాలు తో పాటు

నాటి సమాజములో దూరం పెట్టబడిన హరిజన వాడల్లో సైతం తిరుగాడుతూ వారికి మంచి మార్గదర్శకత్వాన్ని చూపించారు. 

ఈ నాడు మనం మంత్రాలు చదివేస్తున్నాం, విష్ణు

సహస్రనామ స్తోత్రం చదివేస్తున్నాం, భగవద్గీత చదివేస్తున్నాం, శ్రీరామాయణం చదివేస్తున్నాం. కానీ సుమారు 1930 కాలాన్ని తీసుకుంటే వీటిని బ్రాహ్మణుడు కానివాడు

చదివితే సమాజంలోంచి వెలివేసేవారు. సామూహిక పూజా కార్యక్రమాలు చేసేసుకుంటున్నాం ఈనాడు, కానీ 1930లో సామూహిక కార్యక్రమాలకు తావు ఉండేదేకాదు, కేవలం ఆలయాల్లోనే

జరిపేవారు. మన స్వామి వారు గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ మహిళా మండలి ఎర్పాటుచేసి మన మన ఇల్లల్లో ప్రతిరోజు భగవంతుడు ఉండాలి అని బ్రాహ్మణ-అబ్రాహ్మణ తేడాలేకుండా,

స్త్రీ-పురుష అనే తేడాలేకుండా అందరికీ పూజ చేసుకొనే సాంప్రదాయం అలవాటు చేయించారు. నిజానికి 11వ శతాబ్దంలో రామానుజులవారు అందరికీ మంత్రాన్ని ఇచ్చి అందరూ తరించే

అవకాశం ఇచ్చారు, కానీ ఎందుకనో కాల గతిలో అది పోయింది. ఎన్నో అంతరాలు ఏర్పడ్డాయి. ఈ నాడు అనేక సంప్రదాయాల వారు ప్రచారం చేసుకోగలుగుతున్నారు అంటే కారణం మన

స్వామివారు పూర్వాశ్రమ సమయంలో చేసిన కార్యక్రమాల వల్ల ఏర్పడ్డ పునాది. నాలుగు గోడల మద్య ఎవరి విశ్వాసాలు వారికి ఉన్నా, సమాజిక కార్యక్రమాల్లో అందరినీ ఒక వేదిక

మీదికి రప్పించి బ్రాహ్మణ-అబ్రాహ్మణ తేడాలేకుండా, స్త్రీ-పురుష అనే తేడాలేకుండా, స్మార్త--వైష్ణవ తేడా లేకుండా ఒక స్పూర్తిని ఇచ్చారు. వేదాలకు ఎన్నో కట్టు బాట్లు,

కనీసం మిగతా గ్రంథాలను అందరికీ అందుబాటులో తెచ్చిన వారు ఎవరైనా ఉన్నారో చరిత్ర చూడటం అలవాటు ఉండే వారు చరిత్ర తిరిగవేస్తే మన స్వామి వారే తప్ప మరొకరు కనిపించరు.

తమ స్వంత స్థలంలో దేశంలోనే మొదటి హరిజన వాడను నిర్మింపజేసి ఇచ్చారు. ఇలాగా ఇటు సామాజిక విప్లవాన్ని అటు అందరినీ దైవ కార్యక్రమాల్లో పాలుగొనేట్టు చేసారు.

పండితమహా సభలు ఏర్పాటు చేయించి, పండితులు తమ తమ విజ్ఞానాన్ని ఒకరికి చెప్పాలి అని వారిచే ఉపన్యాసాలు ఇచ్చేట్టు చైతన్యం చేసారు. కేవలం సామాజిక సృహ కాదు అది

ఆధ్యాత్మిక  à°ªà±à°¨à°¾à°¦à°¿à°ªà±ˆ నిలబడాలి అనే స్పూర్తిని లోకంలో కలిగించిన మహనీయులు. ఇలా స్వామి వారి కార్యక్రమాలు ఎన్నో.

చిన్న జీయర్ అనే పరమౌషధాన్ని అందించారు:. .

.  

సమాజ శ్రేయస్సే లక్ష్యంగా  à°¦à±‡à°¶à°¾à°Ÿà°¨ చేస్తున్న పెద్ద జీయర్ స్వామికి  à°¤à°¦à±à°ªà°°à°¿ తమ లక్ష్యాలను సమాజానికి తీసుకు వెళ్లి మార్గదర్శకంగా నిలిచే వారి కోసం

ఎదురు చూస్తున్న తరుణంలో ఒక నూనూగు మీసాల కుర్రవాడు (18 ఏళ్ళ వయసు) వీరి బృందంలో చేరడం జరిగింది. తదుపరి కాలంలో ఆశ్రమం లో జరిగే అన్ని కార్యక్రమాలను సమీక్షించే

భాద్యతలను కార్యాలయంలో ఉండి పని చేసే ఇతనికి అప్పగించడం జరిగింది. ఆనతి కాలంలోనే ఏకసంథాగ్రాహి అయినా ఈ కుర్రవాడు సమర్ధవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలూ

పొందగలిగాడు. పెద్ద జీయర్ స్వామికి అస్త్వతత కల్గిన సమయంలో సంస్థ నిర్వహణ భాద్యతలను ఈ యువకునికి అప్పగించే భాద్యతలను సంస్థలో పెద్దలైన టి కె గోపాలాచార్య స్వామి

చేపట్టడం జరిగింది. ఎన్నో కఠిన పరీక్షల అనంతరం ఈ యువకునికి సన్యాసం దీక్ష అనుగ్రహించడం జరిగింది. నాడు పెద్దలు తీసుకున్న భాద్యతలు సరి అయినది అని నేడు

నిరూపితమైంది. à°† నాడు సన్యాసం దీక్ష తీసుకున్న 19 ఏళ్ళ  à°¨à°µ  
యువకులే నేడు ప్రపంచం లోని ఎందరో మహనీయులచే జగదాచార్యులుగా కొనియాడ బడుతున్న నేటి త్రిదండి చిన్న

జీయర్ స్వామి. స్వామికి పెట్టబడిన à°•à° à°¿à°¨ పరీక్షలు ప్రత్యక్షంగా చూసిన వారు à°•à°‚à°Ÿ తడిపెట్టని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.  . .

. స్వాతంత్ర పోరాటం నుంచి

సన్యాసాశ్రమం  à°µà°°à°•à±‚. . .

తూర్పు గోదావరి జిల్లా  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం కు చెందిన పెద్ద జీయర్ స్వామి పూర్వాశ్రమం లో స్వతంత్ర పోరాటం లో సైతం పాల్గొన్నారు. భారత

స్వాతంత్య్ర పోరాటం లో భాగంగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనంతర కాలంలో సమాజంలో జరుగుతున్నా అన్యాయాలను తగిన రీతిలో సానుకూల పరిష్కారం చూపించాలి అనే

సంకల్పంతో తమ సహాధ్యాయి  à°…యిన  à°—ోపాలాచార్య స్వామి తో కలిసి ఆధ్యాత్మిక ప్రచార భాద్యతలను చేపట్టారు. 

ప్రతి క్షేత్రం లోనూ శ్రీరామ క్రతువులే. .

.. 

శ్రీకూర్మం నుంచి బదరి నాధ్ క్షేత్రం వరకూ ఎన్నో ప్రాంతాల్లో à°…à°–à°‚à°¡ శ్రీరామ క్రతువులు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿  à°µà°¾à°¡ వాడాలా శ్రీరామ నామాన్ని ప్రసరింప చేసిన మహనీయులు

పెద్ద జీయర్ స్వామి. శ్రీకూర్మం, రామ తీర్ధాలు, సింహాచలం, తిరుమల తదితర క్షేత్రాల్లో ఈ శ్రీ రామ క్రతు స్తంభాలను నేటికీ దర్శించవచ్చు. చెన్నై మహా నగరం లో 70 వ దశకంలో

కరువు ప్రబలిన సమయంలో పెద్ద జీయర్ స్వామి à°† ప్రాంతంలో శ్రీ రామ క్రతువు నిర్వహించి జల కళలను తీసుకు రావడం తో నాటి నాస్తికులు  à°¸à±ˆà°¤à°‚ స్వామిని దర్శించిన సంఘనటనలు

ఉన్నాయి.  

ఆధునిక రామానుజులు అంటే పెద్ద జీయర్ స్వామీ అనే అందరికీ అనుభవం. వీరి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక  à°µà±ˆà°­à°µà°¾à°¨à°¿à°•à°¿ ప్రభావితులై వెలది మంది వీరికి

శిష్యులుగా మారడం జరిగింది. ఎంతటి వైభవం ఉన్న. . . అత్యంత సాదా జీవనాన్ని gadipina మహనీయులు à°ˆ అపర రామానుజులు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam