DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీలంక ద్వారా తమిళనాడులో ఉగ్రవాదుల చొరబాటు!

శ్రీలంక మీదుగా దేశంలోకి లష్కరే ముష్కరులు

నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్రంలో హైఅలర్ట్‌

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, DNS , తిరుపతి ). . .

.

తిరుపతి, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¦à°•à±à°·à°¿à°£ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  à°ªà°¾à°•à°¿à°¸à±à°¥à°¾à°¨à±‌ కేంద్రంగా పనిచేసే

లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి కొయంబత్తూర్‌లో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో

రాష్ట్రంలో హెచ్చరికలు జారీ చేశారు.

ముష్కరుల్లో ఒకరు పాకిస్థానీ కాగా.. ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా తెలుస్తోంది. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర

చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి.  రద్దీ ప్రదేశాలు, ప్రముఖ రాజకీయ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా

చేసుకుని వీరు దాడులకు పాల్పడే ప్రమాదముందని పేర్కొన్నాయి. 

దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేశారు. కొయంబత్తూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు.

నగరంలోని అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు...  à°…టు చెన్నైలో à°¬à°²à°—ాలను పెంచారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌, ఆలయాల వద్ద భద్రతను

కట్టుదిట్టం చేశారు.  à°¤à±€à°° ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేశారు. 

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన

దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి.  à°•à°¶à±à°®à±€à°°à±‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను

పాకిస్థాన్ ఉసిగొల్పనుందని నిఘా సంస్థలు ఇటీవల హెచ్చరించాయి.  
à°† ఉగ్రమూకలు కశ్మీర్‌లోకి చొరబడటానికి ఇప్పటికే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్‌ లాంచ్

ప్యాడ్స్‌ వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam