DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హంద్రీనీవాలో టీడీపీ నేతలు వందల కోట్లు దోపీడీ

పయ్యావుల కేశవ్ అక్రమాలకు అంతేలేదు.

ఆయకట్టుకు నీరివ్వకుండా అడుగడునా పయ్యావుల కుట్ర.

ఐదేళ్లలో జిల్లాను సస్యశ్యామలం చేయడమే జగన్

లక్ష్యం.

"రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్" తో వేల ఎకరాలకు నీరిస్తాం.

మంత్రి శంకర్ నారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డి 

(రిపోర్ట్: M. మనోహర్, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అనంతపురం) . . .

అనంతపురం, ఆగస్టు  24, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¡à°¿à°šà°¿à°¨ ఐదేళ్ళలో అనంతపురం జిల్లాలో హంద్రీనీవా à°•à°¿à°‚à°¦ ఒక్క ఎకరానికి కూడా నీరివ్వకుండా

రైతాంగాన్ని చంద్రబాబు మభ్యపెట్టాడని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు.అదే విదంగా హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల

కేశవ్ వందల కోట్ల రూపాయలు దిగమింగడాని మంత్రి ఆరోపించారు.శనివారం బెలుగుప్ప, ఉరవకొండ మండలాల్లో మంత్రి శంకర్ నారాయణ, యంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు

రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు హంద్రీనీవా అధికారులతో కలిసి పర్యటించారు.కాలువపల్లిలో రైతు సమస్యలు తెలుసుకున్నారు.జీడిపల్లి

గ్రామంలో నిర్వాసితులతో సమావేశం అయ్యారు. గ్రామంలో రిజర్వాయర్ కారణంగా వస్తున్న ఉట నీరును వారు పరిశీలించారు.గ్రామంలోని పాఠశాలను సందర్శించి విద్యార్థులతో

మాట్లాడారు.  à°…నంతరం జీడిపల్లి జలాశాయన్నీ సందర్శించిన నేతలు అక్కడ à°—à°‚à°— పూజ నిర్వహించారు.అక్కడినుండి అంకంపల్లి వద్ద హంద్రీనీవా 10 à°µ లిఫ్ట్ ను

పరిశీలించారు.దుద్దేకుంట,గంగవరం,శీర్పి మీదుగా బెలుగుప్ప లో పర్యటించారు.అక్కడ వారిని పలువురు సన్మానించారు.తరువాత ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామం వద్ద

హంద్రీనీవా కెనాల్ పై నిర్మింప తలపెట్టిన "రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్" స్థలాన్ని వారు  à°¸à°‚దర్శించారు. à°ˆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

పై వారు ఫైర్ అయ్యారు. గడిచిన ఐదేళ్లలో కేశవ్ సంపాదనే ధ్యేయంగా పనిచేసాడని విమర్శించారు.36 వ ప్యాకేజీ లో 60 కోట్ల రూపాయల పనులకు 260 కోట్లకు పెంచుకోవడమే ఉదాహరణ అని

పేర్కొన్నారు. గడిచిన ఆరేళ్లుగా కృష్ణ జలాలు అనంతపురం జిల్లాకు వస్తున్నాయంటే అది మహా నేత వైస్సార్ చలువేనని వారు అన్నారు.జిల్లా మొదటిదశ కింద 2 లక్షల ఎకరాలకు

సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.జీడిపల్లి వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గ్రామ పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.ఈఏడాది

కృష్ణ జలాలను హంద్రీనీవా ద్వారా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి చెరువులు నింపుతామని తెలిపారు. జిల్లాలో ఆయకట్టుకు నీరు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షంగా

పెట్టుకున్నారని à°† దిశగా కృషి చేస్తామన్నారు.ఆయకట్టుకు సంబంధించి పూర్తి నివేదిక  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ పంపాలని అధికారులకు మంత్రి శంకర్ నారాయణ ఆదేశించారు.à°ˆ

కార్యక్రమంలో హంద్రీనీవా అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam