DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధార్‌ - కేవైసి అప్‌డేట్ కు ఎటువంటి గడువు లేదు : 

త్వరలోనే స్కూళ్ళు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధార్ అప్‌డేట్  

రేషన్ యధాతధం గానే సరఫరా చేస్తారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన

శశిధర్

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి,  à°†à°—స్టు  25, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°†à°§à°¾à°°à± అప్‌డేట్‌కోసం ప్రజలెవ్వరూ ఆందోళన పడవద్దని,

 à°•à±‡à°µà±ˆà°¸à°¿ అప్‌డే డేట్ కు ఎటువంటి గడువు లేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఆందోళనల

నేపధ్యంలో ఆయన à°’à°• ప్రకటన విడుదల చేసారు. దీని ప్రకారం  à°†à°§à°¾à°°à±‌ మరియు కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురైన ఘటనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, ఆధార్

అప్‌డేట్‌కోసం ప్రజలెవ్వరూ ఆందోళన, ఆదుర్దా పడాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వాటిని అప్‌డేట్‌ చేయించుకోవచ్చు ఎటువంటి గడువు లేదన్నారు.

స్కూలు పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదు

అన్నారు. 

రానున్న రోజుల్లో స్కూలు పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుంది. అక్కడే ఆధార్ వివరాలు

అప్‌డేట్‌ చేయించుకోవచ్చు అని తెలిపారు. 

e-కేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషప్‌ సరుకులను తిరస్కరించడం అంటూ ఉండదని, ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటున్నారో

అక్కడ మాత్రమే e-కేవైసి చేసుకోవలెను. à°ˆ -కేవైసి కొరకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళ కూడదు. ఇదివరకు  à°°à±‡à°·à°¨à± దుకాణం వద్ద కేవైసి

చేయించుకొని ఉంటే మరల చేయించవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఆధార్ కేంద్రాలు వద్ద, మీ సేవ కేంద్రాల వద్ద, పోస్టాఫీసుల వద్ద

పడిగాపులు పడొద్దని విజ్ఞప్తి చేసారు.  à°ˆ విపత్తు పై అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు, మీడియా సంస్థలు à°ˆ అంశాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam