DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్

జిల్లాలో 2,06,211 మంది అభ్యర్థులు 

తూ.గో జిల్లా కలెక్టర్ మురళిధర్ రెడ్డి వెల్లడి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). . . . 

అమరావతి,  à°†à°—స్టు  26, 2019

(డిఎన్‌ఎస్‌) : గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది నియామక వ్రాత పరీక్షలు నిర్వాహణ కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ à°¡à°¿.

మురళిధర్ రెడ్డి వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్ నందు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 8 తేదీ వరకు సచివాలయ సిబ్బంది నియామక

వ్రాత పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 2,06,211 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు వ్రాస్తారని తెలిపారు. 1వ తేదీ ఉదయం పరీక్ష కు లక్షా ఇరవై ఐదు వేల, మధ్యాహ్నం పరీక్ష కు 30 వేల మంది

జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాల లో హాజరు కానున్నారని అన్నారు. మిగిలిన అభ్యర్థులు 3, 4, 6, 7, 8  à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹ కాకినాడ నగర, రూరల్ పరిధిలోని కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు

వ్రాయాలని అన్నారు. సమర్ధవంతంగా పరీక్షలు నిర్వహణకు 37 మంది ప్రత్యేక అధికారులు, 102 మంది రూట్ అధికారులు, 481 మంది సెంటర్ అధికారులు, 657 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు, 286 కో

ఆర్డినేటర్ లు,1667 హాల్ సూపరింటెండెంట్ లు, 6226 మంది ఇన్విజిలేటర్లు మరియు పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల సమన్వయం తో జరుగుతాయన్నారు. దూర ప్రాంత అభ్యర్థులకు రాజమండ్రి

బొమ్మన రామచంద్ర రావు కళ్యాణ మండపంలో, కాకినాడ అంబేద్కర్ భవన్, జిల్లా పరిషత్ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అడ్డతీగల ఐటిడిఎ

క్వార్టర్స్ లో బస ఉంటుందన్నారు. జిల్లాలో 481 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్1 న 2532 మంది దివ్యాoగులు పరీక్ష వ్రాస్తారని వారిలో118

మంది కి సహాయకులు ఉంటారన్నారు. వీరికి 50 నిముషాలు అదనపు సమయం కేటాయించామన్నారు. అభ్యర్థులు హల్ టిక్కెట్, ఐడి కార్డు, పెన్ మాత్రమే తీసుకురావాలని, ఎలక్ట్రానిక్

వస్తువులు అనుమతించ బడవన్నారు. కేంద్రాల వద్ద144 సెక్షన్ ఉంటుందన్నారు. దుష్ప్రచారం, దళారులను నమ్మొద్దని, పూర్తి పారదర్శకంగా పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు

తమ  హాల్ టికెట్ల ను gramasachivaalayam.ap.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం

జరిగిందన్నారు.కాకినాడ, రామచంద్రాపురం డివిజన్ లకు 9640513888, అమలాపురం, పెద్దాపురం డివిజన్ లకు9390980811, రాజమండ్రి, రంపచోడవరం డివిజన్ లకు 9346682055కాల్ సెంటర్లకు ఫోన్ చేసి సందేహ

నివృత్తి చేసుకోవాలని తెలిపారు. à°ˆ  కార్యక్రమంలో జడ్పీ సీఈవో à°Žà°‚ జ్యోతి, డిఆర్వో à°ˆ సత్తిబాబు, ఐ & పీ ఆర్ డీడీ à°Žà°‚ ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam