DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేల ఎకరాలు ఇచ్చిన రైతులను మోసం చేస్తే ఊరుకోం : ఉమా 

వందరోజుల వైయస్ జగన్ పాలలో చేసిందేమీ లేదు

ప్రజా సమస్యలను గాలికొదిలి చంద్రబాబు పై కక్షా .

ఇసుక లేకుండా చేసి భవన కార్మికులను

రోడ్డెక్కించారు

అన్న క్యాంటీన్లు తీసేసి నిరుపేదల కడుపుకొట్టారు

పోలవరం ఆపేసారు - రాజధాని నిలిపేసారు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) . .. 

అమరావతి,  à°†à°—స్టు  26, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజా రాజధాని అమరావతి రైతులకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. సోమవారం నాడు

ఆయన నందిగామలో నిర్వహించిన  à°µà°¿à°²à±‡à°•à°°à±à°² మాట్లాడుతూ, రాజధాని అమరావతిపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని, కొందరు నాయకులు తలోబాట పడుతున్నారని ఆరోపించారు. 34వేల

ఎకరాలను లాభాపేక్ష లేకుండా ప్రజా రాజధాని అమరావతి కొరకు రాజధాని ప్రాంత రైతులు త్యాగం చేస్తే, వారి త్యాగాలను వొమ్ము చేసేందుతు వైకాపా ప్రభుత్వం కుట్రలు

చేస్తుందని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు కూడా హాజరుకాని వైయస్ జగన్ ఇప్పుడు రాజధానిని దొనకొండకో, ఇడుపులపాయకో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని

దుయ్యబట్టారు. రాజధాని ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు అండగా ఉండి, వారి కోర్కెకల కోసం ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. వంద రోజుల వైయస్ జగన్ పరిపాలనలో

చేసిందేమీ లేదని, ఇసుక రద్దు చేసి లక్షలాది మంది భవననిర్మాణ కార్మికులను రోడ్డున పడేసారని, అన్న క్యాంటీన్లను మూసేసి దాదాపు కోటిమంది అభాగ్యుల పొట్ట కొట్టారని

విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని దేవినేని ఉమా సూచించారు. గ్రామాల్లో కలతలు లేకుండా

పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని, తద్వారా చంద్రబాబు కలలను సాకారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam