DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుండి రైతులకు సూక్ష్మపోషకాలు పంపిణీ  

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 26, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లాలో రైతులకు అవసరమైన సూక్ష్మపోషకాలను పంపిణీ చేయుట

జరుగుతుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. సూక్ష్మపోషకాల పంపిణీ అవసరమని పలువురు రైతుల తెలిపారని దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి, కమీషనర్ లతో

చర్చించామని ఆయన తెలిపారు. సూక్ష్మపోషకాల పంపిణీకి తక్షణ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారని ఆయన చెప్పారు. ఈ మేరకు సభాపతి క్యాంపు కార్యాలయం నుండి సోమ వారం ఒక

ప్రకటన విడుదల చేసారు. రైతుల సమస్యలపై చర్చించామని అన్నారు. 2019-20 సంవత్సరం ఖరీఫ్ కాలంలో వివిధ పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, జిప్సంను 100 శాతం

రాయితీపై రైతులకు తక్షణం పంపిణీ చేయుటకు వ్యవసాయ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసారని ఆయన వివరించారు. సమగ్ర పోషక యాజమాన్య పథకం క్రింద సూక్ష్మ పోషకాల పంపిణీ

జరుగుతోందని రైతులు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి సూక్ష్మ పోషకాలు పొందవచ్చని ఆయన తెలిపారు. రైతుల సమస్యలపై తక్షణం మంత్రి స్పందించడం పట్ల కృతజ్ఞతలు

తెలిపారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు అవసరమని తద్వారా పంటలపై దృష్టి సారంచగలరని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల శ్రద్ధ వహించి

వ్యవసాయానికి పెద్ద పీట వేయడం శుభసూచకమని సీతారాం పేర్కొన్నారు. సూక్ష్మ పోషకాల పంపిణీకి జిల్లా వ్యవసాయ శాఖ అన్ని చర్యలు చేపట్టి ఎటువంటి లోపం లేకుండా

సక్రమంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం వ్యవసాయక జిల్లా అని రైతులకు సూక్ష్మపోషకాలు శత శాతం రాయితీతో అందించడం సంతోషదాయకమని అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam