DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ . శివశంకర్

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  26 , 2019 (డిఎన్‌ఎస్‌): సెప్టెంబరు 1à°µ తేదీ

నుండి నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ . శివశంకర్ ఆదేశించారు. సోమవారం ఉడా

చిల్డ్రన్స్ ఎరీనా లో పరీక్ష నిర్వహణకు సంబంధించిన క్లస్టర్ అధికారులు, రూట్ అధికారులు, పరీక్షా కేంద్రాల ప్రత్యేక అధికారులు, చీఫ్ సూపరిండెంట్, స్ట్రాంగ్ రూమ్

ఇన్చార్జి లతో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్షించారు. అధికారులు అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా పరీక్షించి ఎటువంటి లోటు లేకుండా పరీక్షలు సజావుగా

నిర్వహించడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. త్రాగు నీరు విద్యుత్తు తో సహా అన్ని వసతులు ఉండాలన్నారు. అభ్యర్థుల సీటింగ్ అరేంజ్మెంట్ పరీక్షా కేంద్రాలలో

అందరికీ తెలిసేలా మూడు చోట్ల ప్రదర్శించాలన్నారు. ఉదయం గం.9:30 నుండి పరీక్షా కేంద్రాల లోనికి అనుమతి ఇస్తారని, గం. 09:55 కు పేపర్ సెట్లు ఓపెన్ చేసి అందజేసి గం.10 : 00 లకు

పరీక్ష మొదలుపెట్టాలని అదే సమయానికి పరీక్షా కేంద్రం ప్రధాన ద్వారం మూసి వేయాలన్నారు. గం. 12:30 కి పరీక్ష ముగుస్తుందని చెప్పారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రం

లోనికి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదన్నారు. ఈ పరీక్షలు జిల్లాలో 406 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, లక్ష 31వేల మంది

అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట, నర్సీపట్నం ఆర్డీవో ఆర్. గోవిందరావు, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర

రెడ్డి, సూపరింటెండెంట్ రత్నం తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam