DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతిని కుక్కలు చించిన విస్తరి చేస్తున్నారు : బుద్ధ వెంకన్న 

వైఎస్ జగన్ పై టిడిపి ఎమ్మెల్సి ఘాటు విమర్శలు ...

ప్రజల‌కు, ప్రతిపక్షాలకి స్పందనలేని సీఎం అవసరమా  ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . .

.

అమరావతి,  à°†à°—స్టు  29, 2019 (డిఎన్‌ఎస్‌) : కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నరాష్ట్ర రాజధాని అమరావతి ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  à°•à±à°•à±à°•à°²à±

చింపిన విస్తరి చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మండిపడ్డారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ప్రజలు చనిపోతే నాకేం

అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందని, రాజధాని పై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు కులమతాలను రెచ్చగొడుతున్నాయన్నారు. సుమారు 498 ఎకరాలు కిరణ్ కుమార్ రెడ్డి

హయాంలో కట్టబెట్టారాని, 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మనశ్శాంతి కోల్పోతే మీకు లాభం ఏమిటి అని ప్రశ్నించారు. రైతులిచ్చిన భూములలోనే ప్రభుత్వ భవనాలున్నాయని,

అనుమానాలుంటే పరిశీలంచుకోవచ్చన్నారు. ..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో స్పష్టత ఇవ్వాలి అన్నారు. 

దివంగత నేత వైఎస్ఆర్ పుట్టిన కడప జిల్లాలో

స్టీల్ ప్లాంట్ రావాలని పనిచేసింది చంద్రబాబు ప్రభుత్వం అని గుర్తు చేసారు. ప్రాంతాలు, కులాలు గురించి మేము కూడా మాట్లాడగలమని, ప్రజాస్వామ్య వ్యవస్ధలో కులమత

ద్వేషాలు ఉండకూడదు అని హితవు పలికారు. రాజధాని గురించి ప్రజలు తికమక పడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రకటన చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam